Advertisement

  • రేపటి నుంచి తుంగభద్ర పుష్కరాలు ..ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకే భక్తులకు అనుమతి

రేపటి నుంచి తుంగభద్ర పుష్కరాలు ..ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకే భక్తులకు అనుమతి

By: Sankar Thu, 19 Nov 2020 7:39 PM

రేపటి నుంచి తుంగభద్ర పుష్కరాలు ..ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకే భక్తులకు అనుమతి


తుంగభద్ర పుష్కరాలు రేపటి(నవంబర్‌ 20) నుంచి ప్రారంభం అవుతున్నాయని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ తెలిపారు. డిసెంబర్‌ 1 వరకు ఈ పుష్కరాలు కొనసాగుతాయన్నారు.

గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పుష్కరాలకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు వరకు మాత్రమే ఘాట్‌లోకి భక్తులను అనుమతిస్తామని చెప్పారు. తుంగభద్ర పుష్కరాల్లో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం కర్నూలుకు రానున్నారని వెల్లడించారు.

కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం స్నానాలను నిషేదించిట్లు మంత్రి వివరించారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ నది స్నానాలకు అనుమతి లేదని మంత్రి గుర్తు చేశారు. పుష్కరాలను కూడా విపక్షాలు రాజకీయ కోణంలో చూస్తున్నాయని విమర్శించారు. పుష్కరాల పేరుతో చంద్రబాబు నాయుడు వందల కోట్ల రూపాయలను దుర్వినియోగం చేశారని ఆరోపించారు

Tags :

Advertisement