Advertisement

  • ఏసీ బస్సు షెల్టర్ ను ప్రారంభించిన మంత్రి తలసాని శ్రీనివాస్

ఏసీ బస్సు షెల్టర్ ను ప్రారంభించిన మంత్రి తలసాని శ్రీనివాస్

By: Sankar Mon, 16 Nov 2020 8:07 PM

ఏసీ బస్సు షెల్టర్ ను ప్రారంభించిన మంత్రి తలసాని శ్రీనివాస్


సోమవారం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఎదుట నూతనంగా నిర్మించిన ఏసీ బస్ షెల్టర్ ను మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, ఎమ్మెల్యే సాయన్న, కార్పొరేటర్ ఆకుల రూప, అధికారులతో కలిసి ప్రారంభించారు.

హైదరాబాద్ విశ్వనగరంగా రూపుదిద్దుకుంటోందని మంత్రి తలసాని అన్నారు. ప్రయాణీకుల సౌకర్యార్థం నగరంలోని బస్ షెల్టర్ లకు అనేక సౌకర్యాలు కల్పిస్తూ అభివృద్ధి చేస్తున్నట్లు తలసాని తెలిపారు.

హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా అభివృద్ధి చేసే కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ మంత్రి కేటీఆర్ పర్యవేక్షణలో ప్రధాన కూడళ్లలో ని బస్ షెల్టర్ లలో ఏసీ సౌకర్యంతో పాటు సెల్ ఛార్జర్, సీసీ కెమెరాలు వంటివి ఏర్పాటు చేసి అభివృద్ధి చేస్తామన్నారు. ఇప్పటికే నగరంలో 292 బస్ షెల్టర్ ల ఆధునీకరణ పూర్తయిందని, ఇందులో 4 ఏసీ బస్ షెల్టర్లు ఉన్నాయని చెప్పారు.

Tags :
|

Advertisement