- హోమ్›
- వార్తలు›
- దేశంలో రైతులను ఆదుకున్న ప్రభుత్వం ఒక్క తెరాస ప్రభుత్వం మాత్రమే ..తలసాని శ్రీనివాస్ యాదవ్
దేశంలో రైతులను ఆదుకున్న ప్రభుత్వం ఒక్క తెరాస ప్రభుత్వం మాత్రమే ..తలసాని శ్రీనివాస్ యాదవ్
By: Sankar Tue, 08 Dec 2020 12:47 PM
రైతు వ్యతిరేక చట్టాలతో కేంద్రం వ్యవసాయన్ని కార్పొరేట్ వ్యవస్థలకు దారాదత్తం చేసే ప్రయత్నం చేస్తోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు.
కేంద్ర ప్రభుత్వ నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మంగళవారం రైతు సంఘాలు చేపట్టిన భారత్ బంద్లో టీఆర్ఎస్ పార్టీ మద్దతు ప్రకటిస్తూ పాల్గొంది. భారత్ బంద్లో పాల్గొన్న మంత్రి తలసాని మీడియాతో మాట్లాడుతూ.. దేశానికి రైతు వెన్నెముక అని, దేశ వ్యాప్తంగా రైతన్న తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడని అన్నారు.
వ్యవసాయ చట్టాలతో రైతులు నడ్డి విరుగుతోందని, రాజ్యసభలో అన్ని పార్టీలు వ్యతిరేకించినా చట్టాలను ఆమోదించుకున్నారని దుయ్యబట్టారు. సంఖ్యా బలం ఉందని ఈ నల్ల చట్టాలను తీసుకొచ్చారని, చట్టాలను వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన డిమాండ్ చేశారు. దేశంలో రైతులను ఆదుకున్న ప్రభుత్వం టీఆర్ఎస్ మాత్రమే అని ఆయన గుర్తు చేశారు.