లక్ష ఇల్లు చూయించేదాకా భట్టిని తిప్పుతూనే ఉంటాను ..తలసాని శ్రీనివాస్
By: Sankar Thu, 17 Sept 2020 3:13 PM
హైదరాబాద్ లో ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లను మంత్రి తలసాని, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు చూపించారు. రేపు కూడా పరిశీలన ఉంటుందని కాంగ్రెస్ పార్టీ నేతలు, అటు మంత్రి తలసాని చెప్పారు. ఈ సందర్బంగా.. మంత్రి తలసాని మీడియాతో మాట్లాడారు.
సిటీలో కొన్ని ప్రదేశాలు చూశాం... ఇంకా 60 ప్రదేశాలు ఉన్నాయన్నారు. రేపు కొల్లూరు, కుత్బుల్లాపూర్, ఎల్బీనగర్ లో చూస్తామని పేర్కొన్నారు. పేదలు గొప్పగా బతకాలనే ఆలోచనే సీఎం కెసిఆర్ ది.... ఇందిరమ్మ ఇండ్లలో బెనిఫిషరి కొంత కట్టాలి.... కానీ డబుల్ బెడ్ రూమ్ అంతా ఫ్రీ అని తెలిపారు తలసాని. ఇప్పటి వరకు ఈ స్థలంలో ఉన్నవారి కోసం కట్టినవి... కొత్త వారి కోసం మిగిలిన చోట నిర్మాణాలు ఉన్నాయన్నారు. రేపు కూడా తిరుగుతాం... వీలైనంత తొందరగా పూర్తి చేయాలన్నది మా ఆలోచన అని తెలిపారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణంలో భట్టి కూడా సంతృప్తి చెందారు...
లక్ష ఇండ్లు చూపించే వరకు భట్టి ని తిప్పుతానని వెల్లడించారు. ఎన్నికల కోసం చేసే పనులు ఉండవు.. పేదలకు సాయం చేయాలన్నది మా ఆలోచన అని పేర్కొన్నారు. నాలుగేండ్ల నుండి 5 లక్షల వరకు రెంట్ కావచ్చు...కానీ సొంత ఇల్లే వస్తుంది కదా అని మంత్రి తలసాని అన్నారు.