Advertisement

  • మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ , బీజేపీలకు అభ్యర్థులు కరువయ్యారు.. మంత్రి తలసాని

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ , బీజేపీలకు అభ్యర్థులు కరువయ్యారు.. మంత్రి తలసాని

By: Sankar Sun, 01 Nov 2020 4:31 PM

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ , బీజేపీలకు అభ్యర్థులు కరువయ్యారు.. మంత్రి తలసాని


జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మొత్తం150 సీట్లలో.. 104 సీట్లలో విజయం సాధిస్తామని రాష్ట్ర పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పేర్కొన్నారు.

ఆదివారం హైదరాబాద్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌లో వరద బాధితులను ఆదుకునేందుకు కేంద్ర రూ.వెయ్యి కోట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. వరదల కారణంగా నష్టపోయిన ప్రతిఒక్కరినీ తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు.

బాధితులందరికీ పరిహారం అందుతుందని భరోసా ఇచ్చారు. మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీజేపీలకు అభ్యర్థులు కరువయ్యారని ఎద్దేవా చేశారు. పట్టభద్రుల ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఘన విజయం సాధించడం ఖాయమని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు ఏవైనా టీఆర్‌ఎస్‌దే విజయమని మంత్రి తలసాని స్పష్టం చేశారు. దుబ్బాకలో బీజేపీ నాయకులు గోబెల్స్‌ ప్రచారంతో గెలవాలని పరితపిస్తున్నారని వారి ఆశలు ఇప్పట్లో నెరవేరవని అన్నారు.

Tags :
|
|

Advertisement