Advertisement

  • గిరిజనుల భూమికి ఎలాంటి నష్టం జరగదు-మంత్రి సత్యవతి రాఠోడ్...!

గిరిజనుల భూమికి ఎలాంటి నష్టం జరగదు-మంత్రి సత్యవతి రాఠోడ్...!

By: Anji Thu, 15 Oct 2020 10:07 AM

గిరిజనుల భూమికి ఎలాంటి నష్టం జరగదు-మంత్రి సత్యవతి రాఠోడ్...!

ఏజెన్సీ ప్రాంతాల్లో వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల నమోదు విషయంలో గిరిజనులెవరూ ఆందోళన చెందవద్దని గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాఠోడ్ హామీ ఇచ్చారు. కొందరు ప్రతిపక్ష నేతలు పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తూ గిరిజనులను రెచ్చగొడుతున్నారని.. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని మంత్రి కోరారు.

ఆర్వోఎఫ్ఆర్ పట్టాలున్న వారికి ప్రభుత్వ పథకాలు కొనసాగుతాయని మంత్రి తెలిపారు. సాదా బైనామాలు గతంలో అవకాశమిచ్చినప్పుడు కొంతమంది దీనిని వినియోగించుకోలేకపోయారని.. వారి విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి అవకాశం ఇచ్చారన్నారు. ఈ సాదా బైనామాల వల్ల గిరిజనుల భూమికి ఎలాంటి నష్టం జరగదని మంత్రి వివరించారు.

ఏజెన్సీ ప్రాంతాల్లో ఆస్తుల నమోదు విషయంలో గిరిజనులెవరూ ఆందోళన చెందవద్దని మంత్రి సత్యవతి రాఠోడ్ తెలిపారు. సాదా బైనామాల వల్ల గిరిజనుల భూమికి ఎలాంటి నష్టం జరగదని మంత్రి హామీ ఇచ్చారు.

Tags :
|

Advertisement