స్వయంగా తానే మరుగుదొడ్లు శుభ్రం చేసిన మధ్యప్రదేశ్ రాష్ట్ర మంత్రి
By: Sankar Mon, 03 Aug 2020 1:01 PM
మధ్యప్రదేశ్ ఇంధన శాఖ మంత్రి ప్రద్యుమాన్ సింగ్ తోమర్ గ్వాలియర్ లోని కమిషనర్ కార్యాలయంను సందర్శించారు. తరువాత మరుగుదొడ్లు శుభ్రపరిచే సామాన్లలను అందించాలని ఆయన కోరాడు. స్వయంగా ఆయనే పౌర రక్షణా సిబ్బందితో కలిసి అక్కడి మరుగుదొడ్లను శుభ్రం చేశాడు.
మరుగుదొడ్లు సరిగా శుభ్రం చేయలేదని కమిషనర్ కార్యలయంలోని ఒక మహిళ సిబ్బంది ఫిర్యాదు చేశారు. దీంతో మంత్రే స్వయంగా మరుగుదొడ్లు శుభ్రం చేయడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు.
అనంతరం ఆయన విలేకరలతో మాట్లాడుతూ, ‘మరుగుదొడ్లు అందరికి ముఖ్యం. మరుదొడ్లు సరిగా లేకపోతే మహిళలు చాలా ఇబ్బందులను ఎదరుర్కొంటారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పరిసరాలను పరిశుభ్ర కోసం నిరంతరం ప్రయత్నాలు చేస్తున్నారు.
కార్యాలయాలు ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి’ అని పేర్కొన్నారు. మరుగుదొడ్లు ఎల్లప్పుడూ శుభ్రంగా, ఉపయోగపడేలా ఉండాలని అధికారులను ఆదేశించారు. తోమర్ మార్చి నెలలో కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే.