Advertisement

  • రాజకీయ పార్టీలు రాష్ట్ర అభివృధ్ధికోసం ప్రభుత్వంతో కలిసి నడవాలి ..కేటీఆర్

రాజకీయ పార్టీలు రాష్ట్ర అభివృధ్ధికోసం ప్రభుత్వంతో కలిసి నడవాలి ..కేటీఆర్

By: Sankar Fri, 02 Oct 2020 5:03 PM

రాజకీయ పార్టీలు రాష్ట్ర అభివృధ్ధికోసం ప్రభుత్వంతో కలిసి నడవాలి ..కేటీఆర్


త్వరలోనే భువనగిరికి ఎంఎంటీఎస్‌ సర్వీసులు ప్రారంభంకానున్నట్టు తెలిపారు వెల్లడించారు తెలంగాణ మంత్రి కేటీఆర్... యాదాద్రి భువనగిరి జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ వ్యాప్తంగా వేగంగా పట్టణాలు అభివృద్ధి చెందుతున్నట్టు తెలిపారు.

వచ్చే ఐదేళ్లలో ఎక్కువ శాతం పట్టణాల్లోనే ప్రజలు నివాసం ఉంటారన్న ఆయన.. దానికి అనుగుణంగా పట్టణాలను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. కాంక్రీటు జంగిల్‌గా మారుతున్న పట్టణాలను హరిత వనాలుగా మారుస్తున్నామని తెలిపారు. దేశంలో 16,148 టాయిలెట్లు కట్టిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ప్రకటించిన కేటీఆర్.. రాష్ట్రంలో ఉన్న డంపింగ్ యార్డులను ఇంటిగ్రేటెడ్ రిసోర్స్ పార్కులుగా చేశామన్నారు.

రాజకీయపార్టీలు, ప్రజా ప్రతినిధులు అభివృద్ధి కార్యక్రమాలల్లో ప్రభుత్వంతో కలిసి రావాలని పిలుపునిచ్చారు.. ఎన్నికలు ఇంకా మూడేళ్లు ఉన్నాయి.. అప్పుడు పోటీ పడుదామని వ్యాఖ్యానించారు. ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్న పట్టణాలను నియంత్రణలోకి తీసుకొని ప్రణాళికాబద్దంగా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని.. గాంధీ జయంతిని స్వచ్ఛదివస్‌ జరుపుకుందాం.. తెలంగాణ వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో పేరుకుపోయిన చెత్తను బయోమైనింగ్ ద్వారా శుద్ధి చేసి రైతులకు ఎరువుగా అందిదాం అని పిలుపునిచ్చారు.

Tags :
|
|

Advertisement