- హోమ్›
- వార్తలు›
- ఉద్యోగాల విషయంలో విపక్షాలు చెబుతున్న అబద్దాలను ఎండగట్టండి...పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
ఉద్యోగాల విషయంలో విపక్షాలు చెబుతున్న అబద్దాలను ఎండగట్టండి...పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
By: Sankar Sun, 27 Sept 2020 09:30 AM
ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని టీఆర్ఎస్ శ్రేణులకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ముఖ్యంగా ఉద్యోగాల విషయంలో విపక్షాలు చెబుతున్న అబద్దాలను ఎండగట్టాలన్నారు.
అభివృద్ధిని, సంక్షేమాన్ని సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వం దేశంలోనే అగ్రస్థానంలో వెళ్తుంటే.. ప్రతిపక్షాలు ఓర్వలేక పోతున్నాయని కేటీఆర్ మండి పడ్డారు. శాసనమండలి పట్టభద్రుల ఎన్నికల్లో వ్యూహాత్మకంగా ముందుకెళ్లాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గం తెరాస ఓటరు నమోదు ఇంఛార్జిలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే లక్షన్నర ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిందని.. టీఎస్-ఐపాస్ ద్వారా సుమారు 15 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించిందన్నారు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను విద్యాధికులకు చేర్చేందుకు తెరాస శ్రేణులు ప్రయత్నించాలన్నారు. అక్టోబర్ 1న ప్రజా ప్రతినిధులు, నాయకులు కుటుంబ సభ్యులతో పాటు ఓటు నమోదు చేయించుకోవాలని సూచించారు. తాను కూడా అదే రోజున ఓటరుగా నమోదు చేయించుకుంటానని కేటీఆర్ శ్రేణులకు వెల్లడించారు.