Advertisement

  • హైదరాబాద్లో మరో 100 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కేటీఆర్

హైదరాబాద్లో మరో 100 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కేటీఆర్

By: chandrasekar Fri, 28 Aug 2020 8:51 PM

హైదరాబాద్లో మరో 100 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కేటీఆర్


హైదరాబాద్‌లో మరో 100 బస్తీ దవాఖానాలు (హాస్పిటల్)లు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. హైదరాబాద్ పరిధిలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బస్తీ దవాఖానాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. పేదలకు ప్రాథమిక ఆరోగ్యం అందడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. బస్తీ దవాఖానాలపై ఆయన శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఇవి విజయవంతం అవుతున్నందున హైదరాబాద్‌లో మరో 100 బస్తీ దవాఖానాలుల ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. పేదలకు దీనిద్వారా ఆరోగ్యం అందించవచ్చని తెలిపారు.

ఈ సదుపాయం ద్వారా ప్రతి రోజు 25 వేల మందికి వైద్య సేవలు అందిస్తున్నట్లు కేటీఆర్ గుర్తు చేశారు. కొత్తగా నిర్మించబోయే దవాఖానాలు త్వరగా పూర్తి చేయాలని అధికారులకు నిర్దేశించారు. హైదరాబాద్ పరిధిలోని 197 బస్తీ దవాఖానాలు, ఇతర నగర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా ప్రతి రోజు 5 వేల పరీక్షలు నిర్వహిస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. ప్రస్తుతం ఒక్కోదానికి కనీసం 100 మంది వరకూ ఇన్‌పేషెంట్‌ సంఖ్య ఉందని వివరించారు.

అనారోగ్యుల రోగాన్ని గుర్తించడానికి ప్రతి రోజు రోగులకు 53 రకాల పాథోలజీ, మైక్రోబయాలజీ, బయో కెమిస్ర్టీ వంటి వైద్య పరీక్షలు చేస్తున్నామని కేటీఆర్‌ స్పష్టం చేశారు. బస్తీ దవాఖానాలకు పేదల నుంచి మంచి స్పందన వస్తోందని, భవిష్యత్తులో వీటి వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని కేటీఆర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ వాకాటి కరుణ, జిల్లాల కలెక్టర్లు, పురపాలక శాఖ, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రైవేటు హాస్పిటళ్లలో వైద్యం చేసుకోలేని పేదలకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.

Tags :
|

Advertisement