బండి సంజయ్ పై ఫైర్ అయిన మంత్రి కేటీఆర్
By: Sankar Sat, 28 Nov 2020 10:00 PM
బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. మధ్యంతర ఎన్నికలు వస్తాయన్న బండి సంజయ్ వ్యాఖ్యలను కొట్టిపారేశారు మంత్రి కేటీఆర్.
ఎవరో పిచ్చోడు చేసిన వ్యాఖ్యలను మేం పట్టించుకోమని.. అలాంటిదేమీ లేదని... వాళ్లు బీజేపీ నాయకులు కలలు కంటున్నారని మండిపడ్డారు మంత్రి కేటీఆర్. అటు ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా బండి సంజయ్పై ఫైర్ అయ్యారు. బండి సంజయ్ కాదు కదా... మోడీ వల్ల కూడా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూలగొట్టలేరని మండిపడ్డారు. బీజేపీది సోషల్ మీడియా ప్రభుత్వమని.. టీఆర్ఎస్ది ప్రజల ప్రభుత్వమని దయాకర్ పేర్కొన్నారు. బండి సంజయ్ ఒక పిచ్చోడని ఆగ్రహించారు.
ఇక బండి సంజయ్ రాంనగర్ ప్రచారంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకడు తాగుబోతు మంత్రి, ఒకడు తిరుగుబోతు మంత్రి అన్ని చోట్లా ఇద్దరి ఫోటో లే....మంత్రుల ఫోటోలు ఎందుకు పెట్టరు అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో మధ్యంతర ఎన్నికలు వస్తాయని అన్నారు. అమిత్ షా వస్తున్నాడు...టీఆర్ఎస్ జాగ్రత్తగా ఉండాలని ఆయన వార్నింగ్ ఇచ్చారు.