Advertisement

  • వైద్యారోగ్య శాఖ పనితీరుపై ప్రశంసలు కురిపించిన మంత్రి కేటీఆర్

వైద్యారోగ్య శాఖ పనితీరుపై ప్రశంసలు కురిపించిన మంత్రి కేటీఆర్

By: Sankar Thu, 08 Oct 2020 2:36 PM

వైద్యారోగ్య శాఖ పనితీరుపై ప్రశంసలు కురిపించిన మంత్రి కేటీఆర్


గత ఆరు నెలలుగా వైద్యఆరోగ్యశాఖ అద్భుతమైన పని చేసిందని... ముఖ్యంగా ఈటల రాజేందర్ నాయకత్వంలో వైద్యారోగ్యశాఖ ప్రజల్లో భరోసా నింపే విధంగా పనిచేస్తూ కరోనా నుంచి ప్రజలను కాపాడుతుందని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు.

ప్రస్తుతం ఉన్న మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం కొవిడ్ సందర్భంగా ఏర్పడిందన్నారు. రానున్న కాలంలో మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరింతగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు. కేవలం ఆరు నెలలు మాత్రమే కాదు... మొత్తం గత ఆరు సంవత్సరాలుగా వైద్యఆరోగ్యశాఖ అద్భుతమైన పనితీరును కనబరిచి అనేక విజయాలను సాధించిందని వెల్లడించారు.

మాతా, శిశు మరణాల రేటు తగ్గించడం నుంచి మొదలుకొని ఐసీయూ యూనిట్‌, బ్లడ్ బ్యాంకులు, డయాలసిస్ కేంద్రాల ఏర్పాటు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలను నిర్వహించిందని పేర్కొన్నారు. వైద్య ఆరోగ్య శాఖ పనితీరులో పాత్ర వహించిన ఆశా వర్కర్ నుంచి శాఖాధిపతి హెల్త్ సెక్రటరీ వరకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు మంత్రి కేటీఆర్.

ఈసారి సీజనల్ వ్యాధులు కూడా బాగా తగ్గాయని...ఇందుకు పంచాయతీ రాజ్ మరియు మున్సిపల్ శాఖ వైద్య ఆరోగ్య శాఖ తో కలిసి పనిచేయడం వల్లనే ఇది సాధ్యమైందని తెలిపారు. రోగాలు, వ్యాధుల పట్ల ప్రజల్లో బాగా అవగాహన పెరిగిందని...ఇతర రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు భారీగా పెరుగుతుంటే ప్రస్తుతం మన రాష్ట్రంలో అదుపులో ఉందని గుర్తుచేశారు.

Tags :
|

Advertisement