భారత్ బంద్ సందర్భంగా జాతీయ రహదారిపై బైఠాయించిన మంత్రి కేటీఆర్
By: Sankar Tue, 08 Dec 2020 12:08 PM
కేంద్రం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయచట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన భారత్ బంద్లో పాల్గొనడానికి మంత్రి కేటీఆర్ బూర్గులకు చేరుకున్నారు.
అనంతరం షాద్నగర్జాతీయ రహదారిపై బైఠాయించి కేంద్రం తెచ్చిన వ్యవసాయచట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేట్టారు. భారత్ బంద్కు మద్దతుగా ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ఆధ్వర్యంలో నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు.
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ కార్యకర్తలు టెక్రియల్ చౌరస్తాకు ర్యాలీగా చేరుకున్నారు. అనంతరం నిజామాబాద్- ముంబై జాతీయ రహదారిని దిగ్భందించారు. టీఆర్ఎస్ కార్యకర్తలు రహదారిపైకి భారీగా చేరుకున్నారు. కార్యక్రమంలో ఎంఎల్సీ కవిత, ఎంపీ బీబీ పాటిల్ పాల్గొని నల్ల బెలూన్లు ఎగురవేసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం జాతీయ రహదారి దిగ్భందనంలో కవిత బైటాయించారు.