Advertisement

  • రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కి భూమిపూజ చేసిన మంత్రి కేటీఆర్...తెలంగాణకే గర్వ కారణం అన్న మంత్రి

రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కి భూమిపూజ చేసిన మంత్రి కేటీఆర్...తెలంగాణకే గర్వ కారణం అన్న మంత్రి

By: Sankar Thu, 13 Aug 2020 9:11 PM

రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కి భూమిపూజ చేసిన మంత్రి కేటీఆర్...తెలంగాణకే గర్వ కారణం అన్న మంత్రి



రంగారెడ్డి జిల్లాలోని శంకర్ పల్లి మండలం కొండకల్ గ్రామంలో 100 ఎకరాల్లో ఎనిమిది వందల కోట్ల వ్యయంతో చేపట్టిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ ఫ్యాక్టరీ జిల్లాకే కాక తెలంగాణకే తలమానికం అని పేర్కొన్నారు.

అనంతరం శంకర్ పల్లి మండలంలోని మొకీల చౌరస్తాలో టీఆర్ఎస్ జెండాను మంత్రి ఎగురవేశారు. కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌ రావు, సబితా ఇంద్రారెడ్డి, జడ్పీ చైర్మన్ అనితా రెడ్డి, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

రూ.800 కోట్ల వ్యయంతో ఈ రైల్వే కోచ్ ఫ్యాక్టరీని నిర్మిస్తున్నారు. ఇది రాష్ట్రము లో తొలి రైల్వే కోచ్ కర్మాగారం కావడం విశేషం. ఏడాదికి 500 రైల్వే కోచ్‌లను ఉత్పత్తి చేయగల సామర్థ్యం దీని సొంతం


Tags :
|
|

Advertisement