Advertisement

  • ఒక్క పైసా తీసుకోకుండా ఇల్లు నిర్మించిన ఘనత సీఎం కెసిఆర్ కు దక్కుతుంది..కేటీఆర్

ఒక్క పైసా తీసుకోకుండా ఇల్లు నిర్మించిన ఘనత సీఎం కెసిఆర్ కు దక్కుతుంది..కేటీఆర్

By: Sankar Wed, 16 Dec 2020 12:26 PM

ఒక్క పైసా తీసుకోకుండా ఇల్లు నిర్మించిన ఘనత సీఎం కెసిఆర్ కు దక్కుతుంది..కేటీఆర్


తెలంగాణ‌లో డ‌బుల్ బెడ్రూం ఇండ్లు క‌ట్టిస్తున్న ఘ‌న‌త సీఎం కేసీఆర్‌దే అని ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. న‌గ‌రంలోని వ‌న‌స్థ‌లిపురం ప‌రిధిలోని జైభ‌వాని న‌గ‌ర్‌లోని రైతుబజార్ వ‌ద్ద‌ నిర్మించిన 324 డ‌బుల్ బెడ్రూం ఇండ్ల‌ను మంత్రి కేటీఆర్ బుధ‌వారం ఉద‌యం ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డ ఏర్పాటు చేసిన స‌మావేశంలో కేటీఆర్ ప్ర‌సంగించారు.

పేదోడు ఆత్మ‌గౌర‌వంతో బ‌త‌కాల‌న్న‌దే సీఎం కేసీఆర్ ఉద్దేశమ‌ని స్ప‌ష్టం చేశారు. అందుక‌నుగుణంగా పేదోడి ఆత్మ‌గౌర‌వానికి ప్ర‌తీక‌గా ఉండే విధంగా ఈ ఇండ్ల‌ను నిర్మించి ఇస్తున్నాం. ఇలాంటి ఇండ్లు భార‌త‌దేశంలోని ఏ రాష్ర్టంలో ఏ ప్ర‌భుత్వం కూడా నిర్మించ‌లేదు. ఢిల్లీ, ముంబై, కోల్‌క‌తా వంటి న‌గ‌రాల్లో ఇలాంటి ఇండ్లు నిర్మించ‌లేదు.

రెండు ప‌డ‌క‌గ‌దులు, ఒక హాల్, కిచెన్‌తో పాటు రెండు బాత్రూమ్‌లను నిర్మించాం. ఒక్కో ఇంటికి రూ. 9 ల‌క్ష‌ల ఖ‌ర్చు పెట్టి నిర్మించామ‌ని తెలిపారు. దాదాపు రూ. 50 ల‌క్ష‌ల విలువ చేసే ఫ్లాట్‌ను పేద‌ల‌కు సీఎం కేసీఆర్ ఇస్తున్నార‌ని తెలిపారు. ఒక్క పైసా కూడా తీసుకోకుండా ఇండ్లు నిర్మిస్తున్న ఘ‌న‌త సీఎం కేసీఆర్‌ది అని స్ప‌ష్టం చేశారు

Tags :

Advertisement