Advertisement

  • వచ్చే పదిరోజులపాటు ఎమ్యెల్యేలు అందరు ఆ ప్రాంతాలలో ఉండాలి ..మంత్రి కేటీఆర్ ఆదేశం

వచ్చే పదిరోజులపాటు ఎమ్యెల్యేలు అందరు ఆ ప్రాంతాలలో ఉండాలి ..మంత్రి కేటీఆర్ ఆదేశం

By: Sankar Tue, 20 Oct 2020 2:07 PM

వచ్చే పదిరోజులపాటు ఎమ్యెల్యేలు అందరు ఆ ప్రాంతాలలో ఉండాలి ..మంత్రి కేటీఆర్ ఆదేశం


హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలకు ప్రభావితమైన కాలనీల్లో సహాయ చర్యల పర్యవేక్షణ కోసం మంత్రి కే. తారకరామారావు ఈరోజు జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు, మేయర్, డిప్యూటీ మేయర్ తో సమావేశాన్ని నిర్వహించారు. ప్రగతి భవన్లో జరిగిన ఈ సమావేశంలో మంత్రి వారికి పలు సూచనలు చేశారు.

రానున్న పది రోజుల పాటు ప్రతి ఒక్క ఎమ్మెల్యే వరద ప్రభావిత ప్రాంతాల్లోనే సహాయక చర్యలను పర్యవేక్షించాలి అని సూచించారు. వరదల వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరికీ ముఖ్యమంత్రి ప్రకటించిన తక్షణ సహాయం అందేలా చూడాలి అన్నారు. నగరంలో వరదలతో నష్టపోయిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ తక్షణ సాయం అందాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన అని తెలిపారు.

అలాగే జీహెచ్‌ఎంసీ ఏర్పాటుచేసిన షెల్టర్ క్యాంపులను పరిశీలించి అక్కడ అందుతున్న సహాయక చర్యలను పర్యవేక్షించాలని సూచించారు. ప్రస్తుతం ముంపుకు గురై కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్క ఫ్యామిలీకి భరోసా ఇచ్చేలా ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో ఉండాలి అన్నారు. ఇక వర్షాలు కొంచెం తగ్గు ముఖం పట్టిన నేపథ్యంలో రిస్టోరేషన్ పనులను పర్యవేక్షించాలి... జీహెచ్‌ఎంసీ చేపట్టిన కార్యక్రమాలను ప్రత్యేకంగా పర్యవేక్షించాలి అని పేర్కొన్నారు.

ఇక ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు రెండు నెలల వేతనాన్ని ముఖ్యమంత్రి సహాయనిధి ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు అని తెలిపారు.

Tags :
|
|

Advertisement