వేర్ ఏ మాస్క్ ఛాలెంజ్లో పాల్గొని మరొక అయిదుగురిని నామినేట్ చేసిన మంత్రి కేటీఆర్
By: Sankar Sun, 30 Aug 2020 06:15 AM
కరోనా నేపథ్యంలో మాస్క్ ధరించడంపై ప్రజల్లో మరింత అవగాహన పెంచేందుకు ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ సోషల్ మీడియాలో మాస్క్ చాలెంజ్ ప్రారంభించింది. దీనిలో భాగంగా తెలంగాణ బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ ‘వేర్ ఏ మాస్క్' చాలెంజ్లో మంత్రి కేటీఆర్కు చాలెంజ్ విసిరారు.
దీనిని స్వీకరించిన మంత్రి కేటీఆర్ మాస్క్ ధరించిన ఫొటోను ట్విట్టర్లో పోస్టు చేశారు. తనను నామినేట్ చేసినందుకు ఆండ్రూ ఫ్లెమింగ్కు ధన్యవాదాలు తెలిపారు. ఈ చాలెంజ్కు మరో ఐదుగురిని నామినేట్ చేశారు. నీతిఆయోగ్ సీఈవో అమితాబ్కాంత్, క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్, జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా, విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్జీ, మేఘాలయ సీఎం కర్నాడ్ సంగ్మా వారిలో ఉన్నారు. ఈ చాలెంజ్ వల్ల ఇతరుల ద్వారా కరోనా వ్యాపించే ముప్పు నుంచి రక్షణ పొందవచ్చని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
ఇప్పటికే తెలంగాణాలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నడుస్తున్న విషయం తెలిసిందే ..అనేక మంది సెలెబ్రిటీలు ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటి మరి కొంతమందిని ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు నామినెటే చేసారు..ఇలా చల్ల మంది సీలెబ్రిటీలు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటి ప్రజలకు మొక్కల యొక్క ప్రాముఖ్యత వివరించారు..