Advertisement

రైతులను రాజు చేయడమే సీఎం కెసిఆర్ ధ్యేయం

By: Sankar Tue, 15 Dec 2020 10:24 PM

రైతులను రాజు చేయడమే సీఎం కెసిఆర్ ధ్యేయం


రైతుల వేదికల నిర్మాణం దేశానికే ఆదర్శమని సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పేర్కొన్నారు. మంగళవారం కొడిమ్యాల మండలం తిర్మలాపూర్‌లో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌తో కలిసి రైతు వేదికను ఆయన ప్రారంభించి మాట్లాడారు.

రైతును రాజు చేయడమే సీఎం కేసీఆర్‌ ధ్యేయమని, రైతు సంక్షేమానికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని పేర్కొన్నారు. రైతు బంధు, రైతబీమా, సాగుకు నిరంతర విద్యుత్ పథకాల అమలుతో రైతుల జీవితాల్లో వెలుగు నింపారని అన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణ సస్యశ్యామలంగా మారిందని అన్నారు. కల్లాలపై రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యానికి అనుగుణంగా అధికారులు, ప్రజాప్రతినిధులు పని చేయాలని సూచించారు.

Tags :
|

Advertisement