Advertisement

  • Breaking News: దుమారం రేపుతున్న మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలు..!

Breaking News: దుమారం రేపుతున్న మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలు..!

By: Anji Fri, 30 Oct 2020 5:40 PM

Breaking News: దుమారం రేపుతున్న మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలు..!

తెలుగు దేశం పార్టీ నాయకులను ఉద్దేశించి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. తెలుగు దేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్, మాజీ మంత్రి దేవినేని ఉమా, ఆ పార్టీ నాయకుల‌పై మంత్రి కొడాలి నాని మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

బషీర్‌బాగ్‌లో చంద్రబాబు కాల్పులు జరిపినందుకు గాను అందరూ తుపాకీతో తమకు తామే కాల్చుకోవాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాతో వైరల్ అవుతున్నాయి.

ఈ మేరకు శుక్రవారం మంత్రి నాని మీడియాతో మాట్లాడుతూ.. లోకేష్‌ లాంటి వేస్ట్‌ మనిషిని మేం ఎక్కడా చూడలేదని, వరి చేనుకు, చేపల చెరువుకు తేడా తెలియని వ్యక్తి అని వ్యాఖ్యానించారు. లోకేష్‌ ఎక్కడ తిరిగినా ఉపయోగం లేదని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై లోకేష్ అనుచిత వ్యాఖ్యలు చేస్తే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.

అలాగే రైతులకు సంకెళ్లు వేశారంటూ మాజీ మంత్రి దేవినేని ఉమా కూడా చేతికి బేడీలు వేసుకున్నారని ఎద్దేవా చేశాయి. అయితే కరెంట్‌ చార్జీలు తగ్గించమని అడిగితే బషీర్‌‌బాగ్‌ వద్ద రైతులపై కాల్పులు జరిపించిన చరిత్ర చంద్రబాబుదన్నారు.

ఇప్పుడు రైతులకు సంకెళ్లు వేశారని దేవినేని ఉమా సంకెళ్ల నాటకం ఆడుతున్నారని.. మరి అప్పుడు బషీర్‌బాగ్‌ ఘటన సమయంలో ఉమా గన్‌తో ఎందుకు కాల్చుకోలేదని ప్రశ్నించారు. దేవినేని ఉమా, టీడీపీ నాయకులు బషీర్‌బాగ్ ఘటనపై ముందు తుపాకీలతో కాల్చుకోవాలని మంత్రి నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

గుంటూరులో జరిగిన ఘటనలో రైతులు తమపై తిరగబడితే సంకెళ్లు వేశామని పోలీస్ సిబ్బంది చెప్పారని మంత్రి నాని అన్నారు. బాధ్యులపై ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకుందని వెల్లడించారు. ఇక, అమరావతిలో మాత్రమే రైతులున్నట్లు చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అమరావతి కొన్నా భూముల ధరలు పడిపోయాయని రైతులను అడ్డం పెట్టుకుని చంద్రబాబు బృందం రాద్దాంతం చేస్తోందని ఆరోపించారు

Tags :

Advertisement