Advertisement

  • మంత్రి కొడాలి నాని పై సెటైర్లు పేల్చిన టీడీపీ ఫైర్ బ్రాండ్ దివ్యవాణి

మంత్రి కొడాలి నాని పై సెటైర్లు పేల్చిన టీడీపీ ఫైర్ బ్రాండ్ దివ్యవాణి

By: chandrasekar Fri, 11 Sept 2020 5:38 PM

మంత్రి కొడాలి నాని పై సెటైర్లు పేల్చిన టీడీపీ ఫైర్ బ్రాండ్ దివ్యవాణి


మంత్రి కొడాలి నాని పై టీడీపీ ఫైర్ బ్రాండ్ దివ్యవాణి సెటైర్లు పేల్చారు. మంత్రి కొడాలి నాని వర్సెస్ టీడీపీ ఏపీలో రాజకీయం వేడెక్కింది. అమరావతి వ్యవహారం, పేదలకు ఇళ్ల పట్టాలపై నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇరు పార్టీలు ఒకరిపై మరొకరు పోలీసులకు ఫిర్యాదు చేసేవరకు వ్యవహారం వెళ్లింది. అయితే మంత్రి కొడాలి నాని మాత్రం వెనక్కు తగ్గలేదు చంద్రబాబును టార్గెట్ చేస్తూనే ఉన్నారు. అయితే మంత్రి వ్యాఖ్యలకు టీడీపీ ఫైర్ బ్రాండ్, అధికార ప్రతినిధి దివ్యవాణి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రాజధాని రైతులు, మహిళలు తన ఫొటోలకు చేసిన శవయాత్ర చూశాక నానికి డిప్రెషన్, ప్రష్టేషన్ ఎక్కువైందని సెటైర్లు పేల్చారు దివ్యవాణి.

దేశంలో న్యాయంగా, ధర్మంగా మాట్లాడేవారు అంతా మంత్రికి పందులు, కుక్కల్లా కనిపిస్తున్నారని గతంలో విడదల రజిని, రోజా వంటివారు జగన్‌ను, రాజశేఖర్‌ రెడ్డిని ఏమన్నారో నానికి తెలియదా అంటూ ప్రశ్నించారు. వల్లభనేని వంశీ జగన్ భార్యను జైలుకు పంపుతానన్నది నిజం కాదా అన్నారు. నిక్కర్లు వేసే వయస్సు నుంచే చంద్రబాబుని చూశానని చెబుతున్న నాని తనకు తానే ఆయన ముందు బాతుబచ్చా అని ఒప్పుకున్నారా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మంత్రి ఎలా పడితే అలా మాట్లాడితే మహిళలు చీపుళ్లతో కొట్టరా అర్థరాత్రి రోడ్లపై తిరిగే ఆడవాళ్లతో తన బొమ్మలు దహనం చేయించారనడం దారుణమన్నారు.

ఆమె మాట్లాడుతూ నాని ఇంట్లో కూడా ఆడవాళ్లు ఉన్నారన్న విషయాన్ని మర్చిపోకూడదని పరోక్షంగా వ్యాఖ్యానించారు. రాజధాని భూముల్ని సొమ్మొకడది, సోకు ఒకడిది అన్నట్లుగా పేదలకు ఎలా పంచుతారని దివ్యవాణి ప్రశ్నించారు. రాజధాని రైతులకు, పేదలకు మధ్య చిచ్చుపెట్టి పబ్బం గడుపుకోవడానికి ప్రభుత్వం కల్లబొల్లి మాటలు చెబుతోందన్నారు. నిజంగా ప్రభుత్వానికి పేదలపై ప్రేముంటే రాజధానిలో చంద్రబాబు ప్రభుత్వం కట్టించిన 5 వేల ఇళ్లను వారికి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టేలా మాట్లాడుతున్న వైఎస్సార్‌సీపీ నేతలకు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. ఈ విధంగా తన ఆగ్రహాన్ని వెలిబుచ్చారు.

Tags :

Advertisement