Advertisement

బీజేపీ పై విరుచుకుపడిన మంత్రి హరీష్ రావు

By: Sankar Mon, 30 Nov 2020 3:40 PM

బీజేపీ పై విరుచుకుపడిన మంత్రి హరీష్ రావు


బీజేపీ ఎన్నికల సంఘం ముందు చేసిన ధర్నా డ్రామా అని పటాన్ చెరులో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన మంత్రి హరీష్ రావు అన్నారు. ప్రచారం కోసం 12 మంది కేంద్ర మంత్రులను, జాతీయ అధ్యక్షున్ని, ప్రధాన మంత్రిని కూడా తీసుకొచ్చారని, 4 ఓట్లు వస్తాయన్న ఆశతో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు.

ప్రజాస్వామ్యంపై నమ్మకం పెంచేలా.. ఎన్నికల ప్రచారం ఉండాలి. కానీ బీజేపీ దీనికి విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. ఫేక్ మీడియా నడపడంలో బీజేపీ కి నోబెల్ బహుమతి వస్తుందన్న ఆయన దుబ్బాక ఉప ఎన్నికల రోజు కాంగ్రెస్ అభ్యర్థి తెరాసలో చేరుతున్నట్టు ఓ ఛానెల్ లోగోతో తప్పుడు వీడియో సృష్టించి వదిలారని అలాగే ఈసారి కూడా, నేను, మా కీలక నేతలు పార్టీ మారినట్టు ప్రముఖ ఛానెళ్ల నకిలీ లోగో తో వీడియోలు తయారు చేయించారని అన్నారు.

ఇతర దేశాల్లో, రాష్ట్రాల్లో గతంలో జరిగిన మత కల్లోలాలు, ప్రార్థన మందిరాల్లో మాంసం వేయడం వంటి వీడియోలు మళ్ళీ ఇక్కడ జరిగినట్లు తప్పుడు ప్రచారం చేయబోతున్నారని ఆయన అన్నారు. వీటిపై మాకు స్పష్టమైన సమాచారం ఉందన్న ఆయన బీజేపీ సోషల్ మీడియాను ఫేక్ మీడియగా మార్చిందని అన్నారు. ఇటువంటి వాటిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన అన్నారు. భాజపా దాడులకు కూడా పాల్పడే అవకాశం ఉందన్న ఆయన తెరాస శ్రేణులు సంయమనంతో ఉండాలని పిలుపునిచ్చారు.

Tags :
|

Advertisement