Advertisement

  • బండి సంజయ్ పై మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు తీవ్ర వ్యాఖ్యలు

బండి సంజయ్ పై మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు తీవ్ర వ్యాఖ్యలు

By: chandrasekar Sat, 19 Dec 2020 11:16 AM

బండి సంజయ్ పై మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు తీవ్ర వ్యాఖ్యలు


బండి సంజయ్ పై తెలంగాణ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు మీడియా సమావేశంలో విరుచుకు పడ్డారు. అసలు బండి సంజయ్ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదని అన్నారు. నువ్వు కేసీఆర్ ను విమర్శిస్తే పెద్ద వాడివి కాలేవని తెలిపారు. కెసిఆర్ గారు తెలంగాణ కోసం తన ప్రాణాలను ఫణంగా పెట్టి చావు నోట్లో తలపెట్టి తెలంగాణ సాధించార‌ని తెలిపారు. బండి సంజయ్ ఎన్నికల్లో నాలుగుసార్లు ఓడిపోయారని అందువల్ల కరీంనగర్ ప్రజలు అతనిని జాలితో కనికరించి గెలిపించారని అందువల్ల ఇదే నీకు మొదటి మరియు చివరి పదవి అని విమర్శించారు.

తెలంగాణలో చిచ్చుపెట్టొద్ద‌ని, తెలంగాణ ప్రజలు నిన్ను కొడితే నువ్వు మానేరు డ్యాములో పడతావని తెలిపారు. అసలు నీకు దమ్ముంటే కేంద్రం నుంచి నీళ్ల వాటాను రాష్ట్రానికి తీసుకురా అలాగే మిషన్ భగీరథకు, మిషన్ కాకతీయకు నిధులు తెచ్చావా! కాళేశ్వరం ప్రాజెక్ట్ కు డబ్బులు తేచ్చావా, అసలు నువ్వు ఏమి చేశావో కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏమి తెచ్చావో చెప్పగలవా అని తీవ్రంగా వ్యాఖ్యానించారు.

Tags :
|
|

Advertisement