ఆ విషయంలో ధోని , పాంటింగ్ ఇద్దరు ఒకటే ..మైక్ హస్సీ
By: Sankar Wed, 15 July 2020 9:51 PM
టీం ఇండియా దిగ్గజ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని తనలోని ఎమోషన్స్ ను తొందరగా చూయించడు..గెలిచినా , ఓడిన ధోని ఎప్పుడు ఒకలాగే ఉంటాడు ..అయితే ఇదే విషయాన్నీ ధోనితో పాటు ఐపీయల్ లో ఆడిన ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు మైక్ హస్సీ అన్నాడు ..ఐపీఎల్ సమయంలో వరుసగా నాలుగు మ్యాచ్ల్లో ఓడినా.. గెలిచినా ధోనీ ఒకే తరహాలో కూల్గా వ్యవహరించేవాడని గుర్తుచేసుకున్న హస్సీ.. అప్పట్లో రిక్కీ పాంటింగ్ కూడా ఇలానే ఉండేవాడని వెల్లడించాడు..
‘రిక్కీ పాంటింగ్ మ్యాచ్లో సెంచరీ బాదినా.. డకౌట్ అయినా ఒకేలా ఉంటాడు. మహేంద్రసింగ్ ధోనీ కూడా వరుసగా నాలుగు మ్యాచ్ల్లో టీమ్ గెలిచినా.. ఓడినా కూల్గానే ఉంటాడు. ముఖ్యంగా.. ఒక టీమ్ కెప్టెన్కి ఉండాల్సిన ప్రధాన లక్షణం అది. ఒకవేళ టీమ్ కెప్టెన్ ఎమోషనల్ పర్సన్ అయితే.. ఎత్తుపల్లాల సమయంలో జట్టులోనూ ఒత్తిడి వాతావరణం ఉంటుంది. అలా కాకుండా కెప్టెన్ ధోనీలా కూల్గా ఉంటే.. జట్టు నిలకడగా రాణించే అవకాశం ఉంది’’ అని మైకేల్ హస్సీ వెల్లడించాడు.
కాగా ప్రపంచ క్రికెట్ లో ప్రెషర్ ని తట్టుకొని మ్యాచ్ లు గెలిపించడంలో ధోని మించిన ఆటగాడు లేని అంటుంటారు ..దానికి తగ్గట్లే ధోని కూడా ఎన్నో సార్లు టీమిండియాకు మ్యాచ్ చివరి వరకు నిలబడి విజయాలను అందించాడు