Advertisement

  • ఆస్ట్రేలియా గడ్డపై రోహిత్ జోరు కొనసాగిస్తాడు ..మైక్ హస్సీ

ఆస్ట్రేలియా గడ్డపై రోహిత్ జోరు కొనసాగిస్తాడు ..మైక్ హస్సీ

By: Sankar Thu, 02 July 2020 10:54 AM

ఆస్ట్రేలియా గడ్డపై రోహిత్ జోరు కొనసాగిస్తాడు ..మైక్ హస్సీ



ఇండియా -ఆస్ట్రేలియా మధ్య టెస్ట్ సిరీస్ అనగానే ఆస్ట్రేలియా ఆటగాళ్లు , మాజీలు మాటల యుద్దానికి తెర తీస్తారు ..తాజాగా ఈ ఏడాది చివర్లో ఇండియా ఆస్ట్రేలియా లో పర్యటించాల్సి ఉంది ..దీనితో ఆ దేశ మాజీ ఆటగాడు మైక్ హస్సీ ఆస్ట్రేలియా బౌలర్లతో భారత ఓపెనర్ రోహిత్ శర్మకి పెద్ద సవాల్ ఎదురుకాబోతోందని హెచ్చరించాడు.ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియా పర్యటనకి వెళ్లనున్న టీమిండియా.. అక్కడ డిసెంబరు 3 నుంచి జనవరి 7 వరకూ నాలుగు టెస్టుల సిరీస్‌‌లో కంగారూలతో తలపడనుంది. గత పర్యటనలో ఆస్ట్రేలియాని టెస్టుల్లో 2-1 తేడాతో ఓడించిన భారత్ జట్టు ఏడు దశాబ్దాల నిరీక్షణ తర్వాత ఆ గడ్డపై టెస్టు సిరీస్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ‌

ఆస్ట్రేలియా‌లో టెస్టు సిరీస్‌ ఏ బ్యాట్స్‌మెన్‌కైనా సవాలే. కానీ.. రోహిత్ శర్మ టాప్ ఆర్డర్‌లో సుదీర్ఘకాలంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. గత ఏడాది నుంచి టెస్టుల్లోనూ అతను జోరందుకున్నాడు. కాబట్టి.. ఆస్ట్రేలియా గడ్డపైనా రోహిత్ శర్మ అదే జోరుని కొనసాగిస్తాడని నా నమ్మకం. కానీ ఆస్ట్రేలియా పిచ్‌లపై.. అదీ టాప్ క్లాస్ బౌలింగ్ అటాక్‌ని ఎదుర్కోవడం రోహిత్ శర్మకి సవాలే అని హస్సీ వెల్లడించాడు..

కాగా ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో ఉన్న అత్యుత్తమ ఆటగాళ్లలో రోహిత్ ఒకడు ..వన్ డే , టి ట్వంటీ ఫార్మటు లో రోహిత్ సూపర్ స్టార్ స్థాయికి ఎదిగాడు ..కానీ టెస్ట్ క్రికెట్లో మాత్రం తన స్థాయి ఆటతీరుని ప్రదర్శించలేకపోయాడు ..అయితే గత ఏడాది అనూహ్యంగా ఓపెనర్ అవతారం ఎత్తిన రోహిత్ , సౌత్ ఆఫ్రికా తో స్వదేశంలో జరిగిన సిరీస్లో మూడు సెంచరీలతో చెలరేగాడు ..ఆ సిరీస్‌లో వరుసగా 176, 127, 212 పరుగులు చేసిన రోహిత్ శర్మ.. ఓపెనర్‌గా గత ఏడాది మొత్తంగా 92.66 సగటుతో ఏకంగా 556 పరుగులు చేశాడు.

Tags :
|
|

Advertisement