Advertisement

  • ఆ రాష్ట్రంలో సెప్టెంబర్ 1 నుంచి మెట్రో రైళ్లు పునః ప్రారంభం

ఆ రాష్ట్రంలో సెప్టెంబర్ 1 నుంచి మెట్రో రైళ్లు పునః ప్రారంభం

By: Sankar Tue, 25 Aug 2020 06:07 AM

ఆ రాష్ట్రంలో సెప్టెంబర్ 1 నుంచి మెట్రో రైళ్లు పునః ప్రారంభం


సెప్టెంబర్‌ ఒకటో తేదీ నుంచి ప్రారంభంకానున్న అన్‌లాక్‌–4 ప్రక్రియలో మెట్రో రైళ్లు తిరిగి పట్టాలెక్కనున్నాయి. అయితే, స్కూళ్లు, కాలేజీలను తెరిచే అవకాశాలు ఇప్పటికిప్పుడు లేవని అధికారవర్గాలంటున్నాయి. ఐఐటీలు, ఐఐఎంల వంటి వాటిని ప్రారంభించేందుకు గల అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తోందని సమాచారం. ఇప్పటిదాకా మూతపడి ఉన్న బార్లు కూడా తెరుచుకోనున్నాయి.

అయితే, కేవలం కౌంటర్‌పై మద్యం విక్రయాలను మాత్రమే అనుమతించేందుకు వీలుంది. బార్‌లో కూర్చుని మద్యం తాగేందుకు అవకాశం ఉండదు. మెట్రో రైళ్ల పునఃప్రారంభంపై వివిధ వర్గాలతో సంప్రదింపులు ముమ్మరంగా కొనసాగుతున్నట్లు అధికార వర్గాలు అంటున్నాయి. కోవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా.. టోకెన్లకు బదులు మెట్రో కార్డుల ద్వారానే ప్రయాణానికి అనుమతించడం, స్టేషన్లలో రైలు ఆగే సమయాన్ని పెంచడం వంటి మార్పులు ఉంటాయని సమాచారం.

కాగా ఢిల్లీలో కరోనా ఉదృతి తగ్గుముఖం పట్టడంతో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మెట్రో రైల్ తిరిగి ప్రారంభించాలని కేంద్రాన్ని కోరిన విషయం తెలిసిందే..కరోనా ప్రారంభంలో దేశంలోనే అత్యధిక కేసులు ఉన్న రాష్ట్రము గా నిలిచిన ఢిల్లీలో ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టినట్లే అనిపిస్తుంది

Tags :
|
|
|

Advertisement