మెర్సిడెస్ బెంజ్- జిఎల్ఇ ఎఎమ్జి 4 మాటిక్ ప్లస్ కూపే భారత్లో విడుదల
By: chandrasekar Thu, 24 Sept 2020 12:44 PM
జర్మనీకి చెందిన ప్రీమియం
కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్- జిఎల్ఇ ఎఎమ్జి 4 మాటిక్ ప్లస్ కూపేను భారత్లో
లాంచ్ చేసింది. మన దేశంలో దీని ధర రూ .1.20 కోట్లు. ఈ కారు మల్టిపుల్ డ్రైవ్
మోడ్లతో పాటు 4MATIC ప్లస్
ఆల్-వీల్ డ్రైవ్ట్రెయిన్తో లాంచ్ అయింది. ఈ కారు 20 అంగుళాల అల్లాయ్ వీల్స్తో
ఏఎంజీ లెటరింగ్తో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. కొనుగోలుదారులు 20 మరియు 22-అంగుళాల
మధ్య పరిమాణాలతో ఉన్న ఏడు రిమ్ వేరియెంట్ల నుంచి దేనినైనా సెలెక్ట్ చేసుకోవచ్చు.
లోపలి భాగంలో, కార్బన్-ఫైబర్
ఇన్సర్టు, ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్, అల్యూమినియం పెడల్స్ మరియు డ్రైవ్ మోడ్లు ఈ కారుకు
అదనపు ఆకర్షణ అని చెప్పవచ్చు. కారులోని
3.0 -లీటర్ ట్విన్-టర్బో సిక్స్-సిలిండర్ ఇంజిన్ను శక్తిమంతం చేయడానికి
స్టార్టర్- ఆల్టర్నేటర్తో 429bhp మరియు
520Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీనిలోని ఇంజిన్ తొమ్మిది
-స్పీడ్ AMG స్పీడ్ షిఫ్ట్ టోక్ క్లచ్ ట్రాన్స్మిషన్ (TCT) తో జత చేయబడుతుంది. ఇది 4MATIC
AWD సిస్టమ్ బాగా పనిచేయడానికి సహాయపడుతుంది.
కేవలం 5.3 సెకన్లలో ఈ
కారు ట్రిపుల్ డిజిట్ వేగం చేరుకోగలదని
మరియు అత్యధికంగా 250 కేఎంపీహెచ్ వేగం సాధించగలదని మెర్సిడెస్ బెంజ్ కంపెనీ
తెలిపింది. దీనిలోని ఉన్న 48V సిస్టం
EQ బూస్ట్ స్టార్టర్ జెనరేటర్గా పనిచేస్తుంది. ఇది
ప్రత్యామ్నాయంగా పనిచేయడమే కాకుండా హైబ్రిడ్ ఫంక్షన్లను కూడా చూసుకుంటుంది. ఇది
మెరుగైన ఇంధన సామర్థ్యాన్ని తిరిగి ఇవ్వడంలో సహాయపడుతుంది. ఇది హై-వోల్టేజ్
హైబ్రిడ్ టెక్నాలజీతో పనిచేస్తుంది. దీనిలో అమర్చబడిన EQ బూస్ట్ స్టార్టర్- ఆల్టర్నేటర్ మొట్టమొదటిసారిగా వేగ
నియంత్రణకు కూడా పని చేస్తుందని కంపెనీ పేర్కొంది. 21bhp అవుట్పుట్ మరియు 250Nm టార్క్, ఎనర్జీ
రికవరీ, షిఫ్టింగ్ లోడ్ పాయింట్, గ్లైడింగ్ మోడ్ మరియు స్మూత్ ఇంజన్ రీస్టార్టింగ్తో
దీనిలోని EQ బూస్ట్
స్టార్టర్ వస్తుంది. ప్రీమియం బ్రాండ్గా పిలువబడే మెర్సిడెస్ బెంజ్ ఎల్లప్పుడూ
టెక్నాలజీ, ఇన్నోవేషన్లో
ముందు ఉంటుంది.