Advertisement

  • నేటితో ఏడాది పూర్తి చేసుకున్న మెగాస్టార్ సైరా నరసింహారెడ్డి

నేటితో ఏడాది పూర్తి చేసుకున్న మెగాస్టార్ సైరా నరసింహారెడ్డి

By: Sankar Fri, 02 Oct 2020 7:09 PM

నేటితో ఏడాది పూర్తి చేసుకున్న మెగాస్టార్ సైరా నరసింహారెడ్డి


మెగాస్టార్ చిరంజీవి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసిన చిత్రం సైరా నరసింహారెడ్డి సినిమాకు నేటితో ఏడాది పూర్తయింది..ఈ సందర్భంగా రామ్‌ చరణ్‌ ట్విటర్‌ వేదికగా ‍స్పందించారు. సినిమా కోసం పని చేసిన ప్రతి ఒక్కరికి గా కృతజ్ఙతలు తెలిపారు. ‘బెస్ట్‌ ఎక్స్‌పీరియన్స్‌, బెస్ట్‌ క్రూ, ఏ బ్రిలియంట్‌ టీం, థ్యాంక్యూ వన్‌ అండ్‌ ఆల్‌’ అని రామ్‌చరణ్‌ ట్వీట్‌ చేశారు. ఈ సినిమాను రామ్‌చరణ్‌ ప్రొడ్యూస్‌ చేశారు.

స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా సైరా నరసింహారెడ్డి తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇందులో మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా, తమన్నా, నయనతార హీరోయిన్లుగా నటించారు. ఇక బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ ప్రధాన పాత్ర పోషించారు. సురేందర్‌ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. మొదటి సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా సురేందర్‌ రెడ్డి కూడా తనని నమ్మి సినిమా చేసిన చిరంజీవికి, రామ్‌చరణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు..

రాజకీయాల నుంచి దూరం అయినా తర్వాత మెగాస్టార్ చిరంజీవి వరుసగా సినిమాలు చేస్తున్నారు..ఖైదీ నెంబర్ 150 సినిమాతో సినిమాల్లోకి మళ్ళీ రి ఎంట్రీ ఇచ్చిన , ఆ తర్వాత సైరా సినిమా చేసారు..ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్నారు

Tags :

Advertisement