కొవిడ్ కేసులతో నిండిపోయిన గాంధీ ఆస్పత్రి ఒత్తిడిలో వైద్య సిబ్బంది
By: chandrasekar Mon, 08 June 2020 8:16 PM
కొవిడ్ కేసులతో గాంధీ
ఆస్పత్రి నిండిపోయింది. ఇప్పటి దాకా రోజుకు సుమారు 150 వరకూ కొత్త కేసులలోపు
నమోదు కాగా, శనివారం ఆ సంఖ్య అమాంతంగా పెరిగిపోయింది. ఏకంగా 200కు
పైబడి రోగుల రాకతో ఆస్పత్రి మొత్తం నిండిపోయింది. గాంధీలో మే 26 వరకు
చికిత్స పొందుతున్నవారు 650 మంది ఉన్నట్లు తెలుస్తోంది.
పది రోజుల్లోనే 805 పెరిగి
రెట్టింపు దాటిపోయారు. ప్రస్తుతం 1,455 వరకూ రోగులు ఉన్నట్లు తెలుస్తోంది. ఆస్పత్రి పడకల సామర్థ్యం దాదాపు
నిండిపోయింది. పైగా, ఇంకా పెద్దఎత్తున
కేసులు నమోదవుతుండడం వైద్యులకు తలకుమించిన భారంగా మారింది. వాస్తవానికి ఆస్పత్రిలో
దాదాపు 1,160 పడకలుండగా
తీవ్రత రీత్యా వైద్య కళాశాలలో 350 అదనంగా సర్దారు.
దీంతో 1,510 అయ్యాయి.
మే నెల నుంచి కేసుల
పెరుగుదలతో డాక్టర్లు, వైద్య సిబ్బందిపై ఒత్తిడి, పని
భారం పెరుగుతోంది. కొద్ది నెలలుగా నిరంతరం సేవలందిస్తున్న వైద్య సిబ్బంది ఇప్పుడు
అలసిపోతున్నారు. నిమ్స్లో కార్డియాలజీ విభాగంలో ఓ రోగికి కరోనా రావడం అది
ప్రొఫెసర్లకు, వైద్యులకు వ్యాప్తి చెందడంతో ఆస్పత్రిలో నియంత్రణ
చర్యలు ప్రారంభించారు. ఆస్పత్రిలో వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు చికిత్స
పొందుతున్న రోగులను సైతం డిశ్చార్జి చేసి పంపించే ప్రయత్నం చేస్తున్నారు.
వెంటిలేటర్పై చికిత్స
పొందుతున్న రోగులను ఎక్కడికి తరలించాలన్న దానిపై ఆస్పత్రి యాజమాన్యం తర్జనభర్జన
పడుతోంది. ముఖ్యంగా ఆదివారం నుంచి స్పెషాలిటీ బ్లాక్ను పూర్తిగా మూసేసేందుకు
సిద్ధమైనట్లుగా సమాచారం. కరోనా వైరస్ వ్యాప్తి చెందింది ఈ బ్లాక్ నుంచే కావడంతో
హైపో క్లోరైడ్ ద్రావణంతో శానిటైజ్ చేయడం వంటి ప్రక్రియ చేపడుతున్నట్లుగా
సూపరింటెండెంట్ సత్యనారాయణ తెలిపారు. ఇప్పటి వరకు నిమ్స్లో వైద్యులు, వైద్య
సిబ్బంది, కార్మికులు
అంతా కలిపి దాదాపు 20 మంది కరోనా వైరస్ బారిన పడినట్లు యాజమాన్యం అధికారంగా
వెల్లడించింది. తెలంగాణ ప్రజల్లో ఆందోళన మొదలైంది.