Advertisement

  • లాక్‌డౌన్‌ లో ఒత్తిడి, ఆందోళనను దూరం చేయాలంటున్న వైద్య నిపుణులు

లాక్‌డౌన్‌ లో ఒత్తిడి, ఆందోళనను దూరం చేయాలంటున్న వైద్య నిపుణులు

By: chandrasekar Thu, 02 July 2020 7:55 PM

లాక్‌డౌన్‌ లో ఒత్తిడి, ఆందోళనను దూరం చేయాలంటున్న వైద్య నిపుణులు


లాక్‌డౌన్‌ మన జీవితాలను చాలా రకాలుగా మార్చేసింది. మనలో చాలామంది ఆరోగ్యకర ఆహారపు అలవాట్లు పాటిస్తున్నా శారీరక శ్రమను మరువడంతో కొత్త సమస్యలు తలెత్తుతున్నాయి. లాక్‌డౌన్‌ విధించడంతో చాలా కంపెనీలు వర్క్‌ ఫ్రం హోం ప్రకటించాయి. దీంతో ఇంట్లోనే ఎక్కువసేపు కూర్చోవాల్సి రావడం, బాడీకి వ్యాయామం లేకపోవడంతో జీవక్రియ వ్యవస్థ గందరగోళంగా మారింది. ఫలితంగా మధుమేహం, ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య వ్యాధులతో బాధపడేవారికి ప్రమాదం ఎక్కువైంది.

నిజానికి లాక్‌డౌన్‌ సమయంలో డయాబెటిక్ రోగుల రక్తంలో గ్లూకోజ్‌ స్థాయి 20% వరకు పెరిగినట్లు ఓ ఆరోగ్య సంస్థ నివేదిక విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 8,200 మంది డయాబెటిక్ రోగులను బీటో అనే ప్రైవేట్ హెల్త్‌కేర్ సంస్థ సర్వే చేసింది. పరిశోధనల ప్రకారం, మార్చి వరకు సగటు రీడింగ్‌ 135 mg / dL వరకు ఉండగా, ఏప్రిల్ మధ్య నాటికి 165 mg / dL వరకు పెరిగాయని సంస్థ పేర్కొంది. ఒత్తిడి, ఆందోళన, జీవనశైలిలో మార్పులు, నిశ్చల అలవాట్లు, పరిమిత శారీరక శ్రమ వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరిగి ఉండొచ్చని సంస్థ తెలిపింది. ముఖ్యంగా ఉత్తర, పశ్చిమ, ఈశాన్య భారతదేశంలోని ప్రజల్లో ఎక్కువగా చక్కెర స్థాయి పెరిగినట్లు సూచించింది.

ఒత్తిడి, ఆందోళన పెరగడం, జీవనశైలిలో మార్పులు ఆరోగ్యాన్ని దెబ్బతీశాయని, ఇది దీర్ఘకాలిక సమస్యలకు దారితీస్తుందని సంస్థ తెలిపింది. రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిని సకాలంలో గుర్తించి తగిన ఆరోగ్య సంరక్షణ చర్యలు చేపట్టకపోతే ఊబకాయం, మంట వంటి కొత్త సమస్యలకు దారితీస్తుందని తెలిపింది. లాక్‌డౌన్‌లో చాలామంది ఇంట్లోనే రకరకాల వంటలు, స్వీట్లు తయారు చేసుకొని తిన్నారు. తీపి వస్తువుల వినియోగం కూడా పెరిగిందని బీటో సంస్థ తెలియజేసింది. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అనుసరించి, జీవనశైలిలో మార్పులు చోటు చేసుకోవడంతో డయాబెటిక్‌ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరిగినట్లు తెలిసింది.

రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడాన్ని ఎప్పుడూ తేలికగా తీసుకోకూడదు. ఇది శరీరానికి పోషకాలను సద్వినియోగం చేసుకోవడాన్ని కష్టతరం చేస్తుంది. శరీరాన్ని అనేక ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. దీర్ఘకాలిక ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంది. మీ రక్తంలో చక్కెరస్థాయి తగ్గించడానికి కొన్ని నియమాలు తెలుసుకుందాము.

రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడాన్ని ఎప్పుడూ తేలికగా తీసుకోకూడదు. ఇది శరీరానికి పోషకాలను సద్వినియోగం చేసుకోవడాన్ని కష్టతరం చేస్తుంది. శరీరాన్ని అనేక ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. దీర్ఘకాలిక ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంది. మీ రక్తంలో చక్కెరస్థాయి తగ్గించడానికి కొన్ని నియమాలు తెలుసుకుందాము.

Tags :

Advertisement