టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరిన మేడల మల్లికార్జున్ జ్యోతి దంపతులు
By: chandrasekar Fri, 20 Nov 2020 11:11 AM
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో
పోటీ చేయడానికి అభ్యర్థులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వీరు ఆశించిన సీట్లు
రాకపోవడంతో వేరే పార్టీలకు మారడం అక్కడ సీట్లు పొందడం జర మాములుగా మారింది. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో సీట్లు ఆశించి
భంగ పడ్డనేతలు అధికార పార్టీ టీఆర్ఎస్ కు గుడ్ బై చెబుతున్నారు.
ఈ కారణంగా హైదరాబాద్ నాచారం
డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు మేడల మల్లికార్జున్ జ్యోతి దంపతులు కాంగ్రెస్ పార్టీ
లో చేరారు. టీఆర్ఎస్ నుండి కార్పోరేటర్ టికెట్ ఆశించిన మల్లికార్జున గౌడ్ ఉప్పల్
ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి తమకు ఆశ చూపి మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
సిట్టింగ్ కే ఇవ్వడంతో మేడల మల్లికార్జున్ జ్యోతి దంపతులు రేవంత్ రెడ్డి సమక్షం లో
కాంగ్రెస్ పార్టీలో చేరారు.
టిక్కెట్లు రాకపోవడంతో
వీరు తీవ్ర నిరాశకులోనై వేరే పార్టీలవైపు మొగ్గు చూపుతున్నారు. మరోవైపు వెంగల్
రావు నగర్ సిట్టింగ్ టీఆర్ఎస్ కార్పొరేటర్ కిలారీ మనోహర్ బీజేపీ తీర్థం
పుచ్చుకున్నారు. నిన్నమొన్నటి వరకు ఒకే
పార్టీలో తిరిగిన నేతలు ప్రత్యర్ధులు
కావడంతో జీహెచ్ఎంసీ ఎన్నికలు మరింత రసవత్తరంగా మారింది. ఎక్కువమంది
అభ్యర్థులు పోటీ పడడంవల్ల ఈ సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి.