Advertisement

  • కెసిఆర్ కు నాకు ఉన్నదీ రాజకీయ వైరం మాత్రమే ..బాలకృష్ణ

కెసిఆర్ కు నాకు ఉన్నదీ రాజకీయ వైరం మాత్రమే ..బాలకృష్ణ

By: Sankar Mon, 01 June 2020 8:35 PM

కెసిఆర్ కు నాకు ఉన్నదీ రాజకీయ వైరం మాత్రమే ..బాలకృష్ణ

బాలకృష్ణ.. తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి పెద్దలు జరిపిన చర్చలపై సంచలన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ‘భూములు పంచుకుంటున్నారు’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా ఇండస్ట్రీలో దుమారం రేపాయి. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు నాగబాబు మాట్లాడుతూ.. ‘బాలకృష్ణ వెంటనే ఇండస్ట్రీకి, తెలంగాణ ప్రభుత్వానికి సారీ చెప్పాలి’ అని డిమాండ్ చేస్తూ ఆయన కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా నందమూరి బాలకృష్ణ ఓ వెబ్ చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఈ అంశంపై బాలయ్య మరోసారి స్పందించారు.

ఈ మీటింగ్స్‌కు నన్ను ఎందుకు పిలవలేదో నాకు తెలియదు అన్న బాలయ్య ‘గతంతో కేసీఆర్‌పై మీరు కొన్ని విమర్శలు చేశారు. అందువల్లే పిలవలేదా’ అని యాంకర్ అడిగితే.. ‘‘చెప్పొచ్చుగా నాకు.. ఆ విషయం చెప్పొచ్చుగా నాకు. కేసీఆర్‌గారికి నామీదేం కోపం లేదు. అయినా అవి రాజకీయాలు. ఇప్పుడు నామా నాగేశ్వరరావుగారిని పార్టీలో జాయిన్ చేసుకోలా. ఆయన ఎన్ని తిట్లు తిట్టాడో తెలుసుగా. రాజకీయాలు వేరండి. అందుకే అనేది హిపోక్రసి, సైకోఫాంటసీ అని. నన్ను వేరేగా చూస్తే మాత్రం నాకు తిక్కరేగుద్ది. కేసీఆర్‌గారికి అటువంటిది ఏమీ లేదు. రామారావుగారి అభిమాని ఆయన. నేనంటే పుత్రవాత్సల్యం ఉంది ఆయనకి. అటువంటిది ఏమీ లేదు. అటువంటిది అని ఉండడు. ఎందుకు పిలవలేదో నాకు తెలియదు’’ అన్నారు.


balakrishna,kcr,nagababu,tollywood,chiranjeevi,nagarjuna ,కెసిఆర్, బాలకృష్ణ , చిరంజీవి ,నాగబాబు,  తెలుగు సినిమా ఇండస్ట్రీ

దీనికి యాంకర్ మరి చిరంజీవి, నాగార్జునగారు పిలవలేదంటారా? ఈ విషయంలో నాగబాబుగారు, మీకు కూడా గొడవ జరిగిందిగా..అని అడుగగా.. ‘‘నాకేం జరగలేదు. అతనే మాట్లాడుతున్నాడు. నేనెందుకు మాట్లాతాను..’’ అని అనగా.. ఆయన అన్నదానికి మీరు ఏమైనా మాట్లాడతారా? అని యాంకర్ అడుగగా.. ‘‘నేనెందుకు మాట్లాడతాను.. అస్సలు మాట్లాడను. ఛీ ఛీ నేను మాట్లాడమేంటి? ఇండస్ట్రీ అంతా ఇవాళ.. ఆల్మోస్ట్ మనకు సపోర్టింగ్‌గా వస్తున్నప్పుడు ఇంక నేనేం మాట్లాడాలి..’’ అని అన్నారు. దీనికి ‘భూములు గురించి’ అని మీరు ఏదో అన్నారుగా? అని యాంకర్ అడిగితే.. బాలయ్య ఏం మాట్లాడకుండా ‘మౌనం’ వహించారు.

Tags :
|

Advertisement