కర్మాగారంలో భారీ అగ్ని ప్రమాదం
By: chandrasekar Tue, 08 Dec 2020 08:48 AM
పారిశ్రామిక ప్రాంతంలోని
కర్మాగారంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒకరు మరణించారు. రెస్క్యూ
సిబ్బంది ముగ్గురిని కాపాడారు. హిమాచల్ ప్రదేశ్లోని సోలన్ జిల్లాలో ఈ ఘటన
జరిగింది. బడ్డీ పారిశ్రామిక ప్రాంతంలోని కర్మాగారంలో సోమవారం తెల్లవారుజామున
మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంపై విచారణ జరుగుతుంది.
ఈ కర్మాగారంలో
చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి చనిపోయాడు. మరో ముగ్గురిని సహాయక బృందాలు
కాపాడారు. ఒక వ్యక్తికి కాలిన గాయాలైనట్లు అధికారులు తెలిపారు. మరోవైపు అగ్నిమాపక
సిబ్బంది మంటలను అదుపు చేశారు. అనంతరం సహాయ కార్యక్రమాలను ముమ్మరం చేశారు. కాగా
ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై దర్యాప్తు చేస్తామని ఎస్పీ
రోహిత్ మల్పాని చెప్పారు. ఇంకా దీనిపై పూర్తి వివరాలు అందాల్సివుంది.