హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం...నష్టం ఎంతో తెలుసా...?
By: Anji Tue, 06 Oct 2020 3:58 PM
హైదరాబాద్ కూరగాయల మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. నగరంలోని పాతబస్తీ మాదన్నపేట కూరగాయల మార్కెట్ షెడ్డులో మంటలు సంభవించాయి. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.
సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని రెండు ఫైరింజన్లతో మంటల అదుపు చేసేందుకు ప్రయత్నించారు. ఈ ప్రమాదంలో లక్షల్లో ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. సుమారు రూ.10లక్షల విలువ చేసే కూరగాయలు, సామగ్రి దగ్ధం అయ్యిందని వ్యాపారులు తెలిపారు.
మార్కెట్లో పలు దుకాణాలు పూర్తిగా అగ్నికి ఆహుతైనట్లు తెలుస్తోంది. సోమవారం అర్థరాత్రి సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. అయితే ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని పోలీసులు భావిస్తున్నారు.
Tags :