Advertisement

  • కొవిడ్‌ ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం...ఆరుగురు కరోనా రోగులు మృతి...!

కొవిడ్‌ ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం...ఆరుగురు కరోనా రోగులు మృతి...!

By: Anji Fri, 27 Nov 2020 08:18 AM

కొవిడ్‌ ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం...ఆరుగురు కరోనా రోగులు మృతి...!

కొవిడ్‌ ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గుజరాత్‌లోని ఓ ఆసుపత్రిలో ఈ రోజు తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది.

ఈ ప్రమాదంలో ఆరుగురు కరోనా రోగులు మరణించారు. రాజ్ కోట్ నగరంలోని ఉదయ్‌ శివానంద్ ఆసుపత్రిలోని ఐసీయూలో శుక్రవారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి.

దీంతో ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆరుగురు కరోనా రోగులు మరణించారు. ప్రమాద సమయంలో ఐసీయూలో పదకొండు మంది రోగులుఉన్నట్లు అధికారులు తెలిపారు.

వారిలో ఆరుగురు చనిపోగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రిలో ఒక్క సారిగా మంటలు చెలరేగడం తో రోగులు భయంతో పరుగులు తీశారు.

సమాచారం అందుకున్నరాజ్‌కోట్‌ అగ్నిమాపకశాఖ అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసారు. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Tags :

Advertisement