Advertisement

బాలిక‌పై సామూహిక అత్యాచార౦

By: chandrasekar Wed, 30 Sept 2020 7:05 PM

బాలిక‌పై సామూహిక అత్యాచార౦


మ‌హారాష్ట్ర‌లో న‌లుగురు యువ‌కులు 15 ఏండ్ల బాలిక‌పై సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. గ‌త ఆగ‌స్టు 8న నాగ్‌పూర్‌లో జ‌రిగిన ఈ ఘ‌ట‌న ఈ ఉద‌యం బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయ‌డంతో వెలుగులోకి వ‌చ్చింది.

న‌లుగురు నిందితుల్లో ఒక‌డైన హృతిక్ మోహిలే సోమ‌వారం రాత్రి బాలిక ఇంటికి వెళ్లి బ‌య‌టికి వెళ్దాం ర‌మ్మ‌ని పిల‌వ‌డంతో గొడ‌వ జ‌రిగింది. ఈ విష‌య‌మై ఉద‌యం బాధితురాలు పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. ఈ సంద‌ర్భంగా గ‌త నెల న‌లుగురు క‌లిసి త‌న‌పై సామూహిక అత్యాచారానికి పాల్ప‌డిన విష‌యాన్ని కూడా తెలిపింది.

కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు నిందితులు న‌లుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో ఒక‌డైన యెష్ మెశ్ర‌మ్ ప్రేమిస్తున్నానంటూ బాలిక‌ వెంట‌ప‌డేవాడ‌ని, గ‌త నెల అత‌ని మాట విని వెంట వెళ్ల‌డంతో మ‌రో ముగ్గురు స్నేహితుల‌తో క‌లిసి ఆమెపై అత్యాచారానికి పాల్ప‌డ్డాడ‌ని పోలీసులు తెలిపారు. కేసు ద‌ర్యాప్తు చేస్తున్నారని అధికారులు చెప్పారు.

Tags :
|
|
|

Advertisement