బాగా అమ్ముడు పోతున్నరాజకీయనాయకుల ముఖాలను పోలిన మాస్కులు
By: chandrasekar Wed, 17 June 2020 7:41 PM
కరోనా వైరస్ విషయంలో
మాస్క్ ఎంత అవసరమో అందరికీ తెలిసిందే. ఇప్పటికే దేశంలో ప్రతీ ఒకరు మాస్క్ వాడటం
మొదలుపెట్టారు. మాస్క్పై జనంలో అవగాహన కూడా బాగానే పెరిగింది. దీంతో మాస్క్
లేనిదే జనం బయటకు వెళ్లడం లేదు. దీంతో మాస్కులు కూడా భారీగా డిమాండ్ పెరిగింది.
ఇంట్లో ఒక్కో వ్యక్తి రెండు మూడు మాస్కులు కొని పెట్టుకుంటున్నారు. కరోనా వైరస్
నియంత్రణకు ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ప్రజలను హెచ్చరిస్తున్న
విషయం తెలిసిందే.
దీని వలన మాస్కుల
వినియోగం భారీ స్థాయిలో పెరిగింది. ఈ డిమాండ్ను క్యాష్ చేసుకునేందుకు అటు
వ్యాపారులు కూడా వివిధ రూపాల్లో మాస్కులను తయారు చేసి అమ్ముతున్నారు.
భోపాల్కు చెందిన కునాల్
పరియణి అనే బట్టల వ్యాపారి మాస్కుల తయారీ విషయంలో కొత్తగా ఆలోచించాడు. మాములుగా
మాస్కులు తయారు చేస్తే ఏముంటుందిలే అనుకున్నాడు. అందుకే ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్సింగ్ చౌహాన్, మాజీ సీఎం కమల్నాథ్ ముఖాలను పోలిన మాస్కులను తయారు
చేసి అమ్మడం ప్రారంభించాడు.
ఈ సందర్భంగా కునాల్
మాట్లాడుతూ ఇప్పటి వరకు మోదీ ముఖాన్ని పోలిన మాస్కులను 500 నుంచి 1000 దాకా
అమ్మినట్లు తెలిపారు. మోదీ మాస్కులకు డిమాండ్ బాగా పెరిగిందన్నారు. శివరాజ్సింగ్
చౌహాన్ మాస్కులు కూడా బాగానే అమ్ముడు పోతున్నాయని తెలిపారు. రాహుల్, కమల్నాథ్ మాస్కులను కూడా విక్రయిస్తున్నట్లు కునాల్
చెప్పారు.
ప్రజల మధ్య ఉన్న సమయంలో
సోషల్ డిస్టెన్సీతో పాటు ముఖానికి మాస్క్ ను పెట్టుకోవాలని ఇప్పటికే అధికారులు
సూచిస్తున్నారు. వైరస్ వెూసుకెళ్తున్న తుంపర్ల నుంచి మాస్క్ రక్షణ కల్పిస్తుందని
WHO
కూడా గతంలోనే చెప్పింది. వాస్తవానికి కొన్ని దేశాలు
ఇప్పటికే బహిరంగ ప్రదేశాల్లో కచ్చితంగా మాస్క్ పెట్టుకోవాలని ఆదేశాలు జారీ
చేశాయి.
ముఖానికి మాస్క్ వాడటం
వల్లే అమెరికాలోని కరోనా కేసుల సంఖ్య బాగా తగ్గింది. న్యూయార్క్ లో ఏప్రిల్ 17న ఫేస్ మాస్క్ తప్పనిసరి చేసిన తరువాత 66,000 కేసులు తగ్గినట్టు వారిపరిశోధనలో తేలిందని అన్నారు.
ఫేస్ మాస్క్ వాడకం తప్పనిసరి చేసిన తరువాత న్యూయర్క్ లో రోజుకి 3శాతం కేసులు తగ్గినట్టు తెలిపారు. అటు, ఇటలీకలో ఫేస్ మాస్క్ వాడకం మంచి ఫలితాలు ఇచ్చిందని
తెలిపారు. సుమారు 78,000 కరోనా
కేసులు తగ్గాయని అన్నారు.