Advertisement

కొత్తగూడెం జిల్లాలో రోడ్డుపై కాలిపోయిన కారు

By: Sankar Fri, 18 Dec 2020 4:13 PM

కొత్తగూడెం జిల్లాలో రోడ్డుపై కాలిపోయిన కారు


భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నడిరోడ్డుపైనే కారు అకస్మాత్తుగా తగలపడింది..కొత్తగూడెంలోని గణేష్ టెంపుల్ దగ్గర కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

లక్ష్మీదేవిపల్లి మండలం శ్రీనగర్ కాలనీకి చెందిన మల్లికార్జునరావు అనే ప్రైవేట్ కాలేజీ లెక్చరర్ కు చెందిన ఓల్డ్ మోడల్ మారుతి 800 కారు అగ్నికి ఆహుతైంది. గణేష్ టెంపుల్ వద్దకు రాగానే కారులో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ కారులో నుంచి కిందకు దిగాడు. ఈ సంఘటనలో కారు పూర్తిగా దగ్ధమైంది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో అక్కడ అంతా పొగలు ఆకాశాన్ని కమ్మేశాయి.

దీంతో రోడ్డుపై ట్రాఫిక్ జామ్ అయింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేసారు ...అయితే కారు ఎందుకు తగలబడింది అనే దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు

Tags :
|

Advertisement