మరికొన్ని రోజుల్లో పెళ్లి.. రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
By: chandrasekar Wed, 29 July 2020 12:13 PM
త్వరలో పెళ్లి చేసుకొని
నిండు నూరేళ్లు జీవించాల్సిన యువకుడు రొడ్డు ప్రమాదంలో చనిపోయాడు. మరికొన్ని రోజుల్లో పెళ్లి ఏర్పాటు చేసారు.
కొద్ది కొద్దిగా పెళ్లిపనులు కూడా ప్రారంభించుకున్నారు. ఇంతలోనే అంతులేని విషాదం ఆ
ఇంటిని చుట్టేసింది.గుర్తుతెలియని వాహనం మృత్యువు రూపంలో అతడి ప్రాణాలు బలి
తీసుకుంది.
మంగళవారం ఉదయం విశాఖ
జిల్లా కొత్తవలస మండలం దేశపాత్రునిపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో అనంతగిరి
మండలం శివలింగపురానికి చెందిన కొర్రు గంగరాజు(33)
మరణించాడు.
పోలీసులు తెలిపిన వివరాల
ప్రకారం విశాఖ రైల్వే క్యారేజ్ అండ్ వ్యాగన్ విభాగంలో టెక్నీషియన్-3గా పని
చేస్తున్న అతడు ద్విచక్ర వాహనంపై విధులకు వెళుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొని
వెళ్లిపోయింది. రోడ్డుపై పడిన గంగరాజు హెల్మెట్ పెట్టుకున్నప్పటికీ తలకు బలమైన గాయమై
అక్కడికక్కడే మృతి చెందాడు.
మృతుడి బంధువులు ఇచ్చిన
ఫిర్యాదు మేరకు ఏఎస్ఐ శ్రీనివాసరావు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని ఎస్.కోట
ఆసుపత్రికి తరలించారు. తన తండ్రి రైల్వేలో పని చేస్తూ అయిదేళ్ల క్రితం విధి
నిర్వహణలో మృతి చెందడంతో గంగరాజు కారుణ్య నియామకం పొందారు. విజయనగరం జిల్లా శంబరకి
చెందిన యువతితో ఇటీవలే వివాహం నిశ్చయమైంది. ఆగస్టు 20న పెండ్లి ముహూర్తాలు పెట్టుకున్నారు.