- హోమ్›
- వార్తలు›
- ఇంకొక్క నిమిషంలో పెళ్లి అనగా , పెళ్లి కూతురుకు కరోనా వచ్చింది అని షాకిచ్చిన తల్లితండ్రులు
ఇంకొక్క నిమిషంలో పెళ్లి అనగా , పెళ్లి కూతురుకు కరోనా వచ్చింది అని షాకిచ్చిన తల్లితండ్రులు
By: Sankar Mon, 27 July 2020 09:38 AM
ఇటీవల కాలంలో కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తిని చూస్తే ప్రజలు బయపడి పారిపోతున్నారు ..తాజాగా అలాంటి ఘటనే మధ్యప్రదేశ్ లో జరిగింది ..నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని అనుకున్న అమ్మాయికి తన తల్లితండ్రులు అనుకోని షాకిచ్చారు ..వివరాల్లోకి వెళ్తే 22 ఏళ్ల యువతి తమ కులానికే చెందిన యువకుడిని ఇష్టపడింది. పెళ్లికి అబ్బాయి కుటుంబ సభ్యులు అంగీకరించినప్పటికీ యువతి తల్లిదండ్రులు నిరాకరించారు. దీంతో ప్రేమికులు ఇద్దరూ కోర్టులో రిజిస్టర్ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. యువకుడు తన కుటుంబంతో కలిసి యువతిని పెళ్లి చేసుకునేందుకు ఆదివారం ఖాండ్వాలోని కోర్టుకు చేరుకున్నారు.
కాగా వివాహన్ని రిజిస్టర్ చేస్తున్న సమయంలో అనూహ్యంగా యువతి తల్లిదండ్రులు కోర్టుకు చేరుకొని వధువుకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు వెల్లడించారు. ఇది విన్న యువకుని కుటుంబం వరుడిని క్వారంటైన్కు తీసుకెళ్లేందుకు యత్నించారు. అంతేగాక కోర్టులోని న్యాయవాది సైతం టైప్ చేయడానికి నిరాకరించి యువతి నుంచి దూరంగా పారిపోయారు.
వెంటనే యువతికి కరోనా పరీక్ష నిర్వహించాలని, ఆ తరువాత పెళ్లి చేయించాలని న్యాయవాది కోరారు. మరోవైపు జిల్లా ఆరోగ్యశాఖ అధికారుల కథనం ప్రకారం యువతికి కరోనా సోకినట్లు తమకేమీ నివేదికలు అందలేదని పేర్కొన్నారు. ఇక తమ కూతురు ప్రేమ పెళ్లి ఇష్టం లేని కారణంగానే యువతి తల్లిదండ్రులు కోర్టులో నానా హంగామా సృష్టించారని తెలిపారు