Advertisement

వేద మంత్రాల మధ్య నిహారిక చైతన్యాల వివాహం

By: chandrasekar Wed, 09 Dec 2020 11:22 PM

వేద మంత్రాల మధ్య నిహారిక చైతన్యాల వివాహం


ఈరోజు రాజస్థాన్ లో రాష్ట్రంలో ఉదయపూర్ లో గల ఉదయ విలాస్ లో నిహారిక వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వీరి వివాహానికి మెగాస్టార్ కుటుంబంతో సహా పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఇక్కడ అ ఉదయ విలాస్ లో నిహారిక మరియు చైతన్య వివాహం వేదమంత్రాల నడుమ మూడు ముళ్ళు వేసి ఏడడుగులు నడిచారు. పెళ్లి ముహూర్త సమయంలో పెళ్లి కుమార్తె నిహారిక బంగారు వర్ణపు దుస్తులతో అలరించారు.

ఈ వివాహ వేడుకల్లో నాగబాబు చాలా భావోద్వేగానికి లోనయ్యారు. నిహారిక తొలిరోజు పాఠశాలకు వెళ్ళేటట్లు అనిపిస్తుంది. పాఠశాలకు వెళ్తున్నప్పుడు ఆమెతో ఆరోజుల్లో 24 గంటలు ఆడుకోలేనని నా మనసుకు చెప్పడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. ఈ సారి ఎంత కాలం పడుతుందో చూడాలి దానిని కాలమే నిర్ణయిస్తుంది. నిన్ను చాలా మిస్ అవుతున్నాను నిహారిక తల్లి అంటూ నాగబాబు తన భావోద్వేగాన్ని తెలిపారు. ఇక్కడ వివాహం హలో నిహారిక చైతన్యాల జంటను కుటుంబ సభ్యులు మరియు వారి యొక్క అత్యంత సన్నిహితులు ఆశీర్వదించారు. వివాహ వేడుకలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వీరి వివాహానికి పలువురు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Tags :
|

Advertisement