ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా కేరళ సీఎం కూతురి వివాహం
By: chandrasekar Tue, 16 June 2020 4:37 PM
కేరళ ముఖ్యమంత్రి పినరయ్
విజయన్ కుమార్తె వీణ వివాహం సీపీఐ (ఎమ్) పార్టీ యూత్ వింగ్ డీవైఎఫ్ఐ
(డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) జాతీయ అధ్యక్షుడు పీఏ మహమ్మద్ రియాజ్తో
సోమవారం జరిగింది. వీరిద్దరికీ ఇది రెండో పెళ్లి కావడం గమనార్హం. ఇది మతాంతర
వివాహం కాగా సాదాసీదాగా పెళ్లి జరిగింది. ఇరువురు దండలు మార్చుకుని అతి కొద్ది
మంది అతిథులు, దగ్గరి బంధువుల సమక్షంలో నిరాడంబరంగా ఈ వివాహం
జరిగింది.
కరోనా వైరస్ మహమ్మారి
వ్యాప్తి కారణంగా ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా ఈ కార్యక్రమం జరిగింది. బంధువులు, అతిథులు
భౌతికదూరం పాటిస్తూ, మాస్క్లు ధరించి ఈ వేడుకలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి
విజయన్ నివాసం వద్దే ఈ వివాహం జరిగింది.
పినరయ్ విజయన్, కమల
విజయన్ దంపతుల పెద్ద కుమార్తె వీణ. ఒరాకిల్లో చాలా కాలం పాటు సాఫ్ట్వేర్
ఇంజినీర్గా పనిచేశారు. తర్వాత బెంగళూరులో సొంతంగా స్టార్టప్ కంపెనీ
ప్రారంభించారు. ఎక్జాలాజిక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ప్రారంభించిన ఆ
సంస్థకు ఆమె మేనేజింగ్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. సంస్థను విజయవంతంగా
నడిపిస్తూ గుర్తింపు పొందారు.
రియాజ్ వృత్తి రీత్యా
లాయర్. విద్యార్థిగా ఉన్నప్పుడే స్టూడెంట్ ఆఫ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా
రాజకీయాల్లోకి ప్రవేశించారు. కోజికోడ్ కార్పొరేషన్కు పోటీ చేసి ఓడిపోయారు. 2009 లోక్సభ
ఎన్నికల్లో కోజికోడ్ నియోజకవర్గం నుంచి సీపీఐ (ఎమ్) అభ్యర్థిగా పోటి చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్కే రాఘవన్ చేతిలో స్వల్ప
ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. రియాజ్ 2017లో డీవైఎఫ్ఐ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. కేరళతో
పాటు పశ్చిమ బెంగాల్, త్రిపురలో డీవైఎఫ్వై యాక్టివ్గా ఉంది.