భారత్ తో రెండో వన్ డే కు ముందు ఆసీస్ కు ఎదురుదెబ్బ ...గాయంతో స్టార్ ఆటగాడు దూరం
By: Sankar Sat, 28 Nov 2020 10:37 PM
భారత్తో తొలి వన్డేలో ఘన విజయం సాధించి ఉత్సాహంతో ఉన్న ఆతిథ్య ఆస్ట్రేలియాకు ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఆల్రౌండర్ మార్కస్ స్టాయినీస్ సిడ్నీ వేదికగా ఆదివారం జరగనున్న రెండో వన్డేకు దూరంకానున్నట్లు తెలిసింది.
తొలి వన్డేలో భారత్ ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో అతడు నొప్పితో ఇబ్బంది పడ్డాడు. ఆ ఓవర్ రెండో బంతి వేసిన తర్వాత మైదానాన్ని వీడటంతో మిగతా బంతులను మరో ఆల్రౌండర్ మాక్స్వెల్ పూర్తి చేశాడు.
ఎడమవైపు నడుము నొప్పితో స్టాయినీస్ బాధపడుతున్నాడని, గాయం తీవ్రత తెలుసుకోవడానికి మరిన్ని వైద్య పరీక్షలు చేయించాల్సి ఉందని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రతినిధి ఒకరు చెప్పారు. స్టాయినీస్ తుది జట్టు నుంచి తప్పుకుంటే అతని స్థానంలో అన్క్యాప్డు ప్లేయర్ కెమెరాన్ గ్రీన్, మరో ఆల్రౌండర్ హెన్రిక్స్ను ఎంపిక చేయనున్నారు.