Advertisement

  • ర‌హ‌దారి నిర్మాణ ప‌నుల్లో ఉన్న వాహ‌నాల‌కు నిప్పు పెట్టిన మావోయిస్టులు

ర‌హ‌దారి నిర్మాణ ప‌నుల్లో ఉన్న వాహ‌నాల‌కు నిప్పు పెట్టిన మావోయిస్టులు

By: chandrasekar Thu, 23 July 2020 3:59 PM

ర‌హ‌దారి నిర్మాణ ప‌నుల్లో ఉన్న వాహ‌నాల‌కు నిప్పు పెట్టిన మావోయిస్టులు


మావోయిస్టులు తెలంగాణ రాష్ట్రంలో పట్టు సాధించడానికి తీరని ప్రయత్నాలు చేస్తున్నారు. భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలోని చెర్ల మండలంలో ర‌హ‌దారి నిర్మాణ ప‌నుల్లో ఉన్న వాహ‌నాల‌కు నిప్పు పెట్టారు.

ఈ ఘ‌ట‌న బ‌తిన‌ప్ల‌లి-తిప్పాపురం గ్రామాల మ‌ధ్య‌లో బుధ‌వారం తెల్ల‌వారుజామున చోటుచేసుకుంది.

ఒక బుల్డోజ‌ర్‌, రోడ్ రోలర్‌పై పెట్రోల్ పోసి నిప్ప‌టించారని పోలీసులు తెలిపారు. ఈ చర్యలో సుమారు 10 మంది సభ్యుల బృందం పాల్గొన్నట్లు స‌మాచారం.

వాహ‌నాల‌కు నిప్పంటించే చ‌ర్య‌ను వ్యతిరేకించిన గ్రామస్తులను బెదిరించార‌న్నారు. కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టిన‌ట్లు చ‌ర్ల పోలీస్ ఇన్‌స్పెక్ట‌ర్ స‌త్య‌నారాయ‌ణ తెలిపారు.

ఇటీవ‌ల‌ మ‌ణుగూరు అట‌వీప్రాంతంలో న‌క్స‌ల్స్ యాక్ష‌న్ టీం క‌ద‌లిక‌లు ప్రారంభ‌మైన త‌ర్వాత ఇది తొలి ఘ‌ట‌న.

Tags :

Advertisement