కేకేఆర్ ట్వీట్ పై ఆగ్రహించిన మనోజ్ తివారి
By: Sankar Thu, 28 May 2020 4:32 PM
ఎనిమిదేళ్ల క్రితానికి సంబంధించిన మధుర స్మృతులను గుర్తుచేస్తూ కోల్కతా నైట్రైడర్స్(కేకేఆర్) చేసిన ట్వీట్ వివాదస్పదమైంది. ఐపీఎల్-12 ట్రోఫీని కేకేఆర్ ముద్దాడి నిన్నటికి ఎనిమిదేళ్లు పూర్తయింది. ఈ విషయాన్ని గుర్తుచేస్తూ.. ప్రతి నైట్రైడర్స్ మనసును తాకిన రాత్రి. తొలిసారి అందుకున్న ట్రోఫీ ఎన్నో భావోద్వేగాలు, మరెన్నో మధురానుభూతులను మిగిల్చింది. మరి మీ జ్ఞాపకాలేంటి?’ అని ప్రశ్నిస్తూ మాజీ సారథి గౌతమ్ గంభీర్, బ్రెండన్ మెకల్లమ్, సునీల్ నరైన్, బ్రెట్లీలను కేకేఆర్ ట్యాగ్ చేసింది.
ఈ ట్వీట్పై కేకేఆర్కు చెందిన అప్పటి ఆటగాడు మనోజ్ తివారీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘అందరితో పాటు.. ఆ రోజుతో నాకు ఎన్నో అనుభూతులు, జ్ఞాపకాలు ఉన్నాయి. కానీ, ఈ ట్వీట్లో నన్ను, షకీబుల్హసన్ను ట్యాగ్ చేయకపోవడం మమల్ని అవమానించినట్టే. మా పేర్లను మరిచిపోవడం నాకు బాధను కలిగించింది’ అంటూ మనోజ్ తివారీ ట్వీట్ చేశాడు. ఇక దీనిపై స్పందించిన కేకేఆర్ ‘అలా కాదు మనోజ్.. నీలాంటి స్పెషలిస్టు ప్లేయర్ను మేమెలా మర్చిపోతాం. ఐపీఎల్-2012 ట్రోఫీని కేకేఆర్ గెలుచుకోవడంలో నువ్ కీలక పాత్ర పోషించావు, నువ్వే మా హీరోవి’ అంటూ బదులిచ్చింది.