Advertisement

  • జీహెచ్ఎంసీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన కేసిఆర్...!

జీహెచ్ఎంసీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన కేసిఆర్...!

By: Anji Tue, 24 Nov 2020 07:34 AM

జీహెచ్ఎంసీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన కేసిఆర్...!

జీహెచ్ఎంసీ ఎన్నికల మేనిఫెస్టోను ముఖ్యమంత్రి కేసీఆర్ విడుదల చేశారు. పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ లో మేనిఫెస్టోను విడుదల చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ, నగర ప్రజలపై వరాల జల్లు కురిపించారు.

వచ్చే నెల అంటే డిసెంబర్ నుంచి వాటర్ బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదని ప్రకటించారు. నగరంలో 98శాతం మంది ప్రజలకు నీటిని ఉచితంగా సరఫరా చేస్తామన్నారు. అలాగే సెలూన్లూ, లాండ్రీలు, దోబీఘాట్ లను వచ్చే నెల నుంచి ఉచిత విద్యుత్ అందిస్తామని పేర్కొన్నారు.

వర్షాలకు దెబ్బతిన్న దోభీ ఘాట్ లను పునరుద్ధరిస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. ఇక లాక్ డౌన్ సమయంలో మోటారు వాహనాల పన్ను రద్దు చేస్తామనీ పేర్కొన్నారు. త్వరలో జీహెచ్ఎంసీ చట్టాన్ని రూపొందిస్తామన్నారు.

రాష్ట్రంలోని అన్ని థియేటర్లలో అధిక షోలు ప్రదర్శించేందుకు అనుమతిస్తాం. కొన్ని రాష్ట్రాల మాదిరి టికెట్‌ ధరలను సవరించుకునే వెసులుబాటు కల్పిస్తాం. తాగునీరు కోసం కేశవాపురంలో రిజర్వాయర్‌ నిర్మాణం చేపట్టాము’ అని తెలిపారు.

Tags :

Advertisement