Advertisement

  • లాక్ డౌన్ కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నాను ..ఉత్తర్ ప్రదేశ్ లో లెటర్ రాసి వ్యక్తి మరణం

లాక్ డౌన్ కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నాను ..ఉత్తర్ ప్రదేశ్ లో లెటర్ రాసి వ్యక్తి మరణం

By: Sankar Sat, 30 May 2020 4:21 PM

లాక్ డౌన్ కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నాను ..ఉత్తర్ ప్రదేశ్ లో లెటర్ రాసి వ్యక్తి మరణం

కరోనా మహమ్మారి వలన దేశం మొత్తం లాక్ డౌన్ విధించడంతో , ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డారు..ఉపాధి కోల్పోయి ,కుటుంబ పోషణ భారమై కొంతమంది , వలస వెళ్లిన కార్మికులు సొంత ప్రాంతాలకు వెళ్లలేక ఇలా అనేక రకాలుగా ప్రజలు ఇబ్బందులు పడ్డారు ..తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లో ఒక వ్యక్తి తన మరణానికి లాక్ డౌన్ విధించడమే కారణం అంటూ సూసైడ్ లెటర్ రాసి రైలు పట్టాల మీద ఆత్మహత్యకు పాల్పడ్డాడు..

ఉత్తర్‌ ప్రదేశ్‌లోని సహజన్‌పూర్‌ జిల్లాకు చెందిన భానుప్రకాశ్‌ గుప్తా హోటల్‌లో పనిచేస్తుండేవాడు. భార్య, నలుగురు పిల్లలు, తల్లితో కలిసి గుప్తా అక్కడే ఒక ఇంట్లో అద్దెకు నివసిస్తున్నాడు. కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌ విధించడంతో అతని గుప్తా కష్టాలు మొదలయ్యాయి. లాక్‌డౌన్‌ విధించిన మొదటిరోజుల్లో ఎలాగోలా కుటుంబాన్ని పోషిస్తూ వస్తున్నాడు. ఇంతలోనే తల్లి ఆరోగ్య పరిస్థితి బాలేకపోవడంతో ఆసుపత్రుల చుట్టూ తిరగడంతో దాచుకున్న డబ్బులు మొత్తం అయిపోయాయి. కాగా కరోనా మహమ్మారి దేశంలో మరింత విజృంభిస్తుండడంతో కేంద్రం లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో భానుప్రకాశ్‌ కష్టాలు రెట్టింపయ్యాయి. చేతిలో చిల్లిగవ్వ లేక కుటుంబపోషణ భారమైపోయింది. దిక్కులేని స్థితిలో ఆత్మహత్య ఒక్కటే శరణ్యమని భావించిన భానుప్రకాశ్‌ సూసైడ్‌ నోట్‌ రాసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.

భానుప్రకాశ్‌ రాసిన సూసైడ్‌ నోట్‌లో.. ' లాక్‌డౌన్‌ నేపథ్యంలో యూపీ ప్రభుత్వం మాకు రేషన్‌ కోటా కింద గోధుమలు, బియ్యం మాత్రమే ఇచ్చింది. ప్రభుత్వం సాయం చేసినందుకు కృతజ్ఞతలు.. కానీ వారు చేసిన సాయం నా కుటుంబానికి సరిపోదు. ఇంట్లోకి కావలసిన పాలు, పెరుగు, ఉప్పు లాంటి నిత్యావసరాలు కొనడానికి నా దగ్గర డబ్బు కూడా లేదు. సరిగ్గా ఇదే సమయంలో నా తల్లి అనారోగ్యానికి గురవడంతో ఆమెకు చికిత్సనందించేందుకు డబ్బులు కూడా లేవు. ఈ విషయాన్ని జిల్లా యంత్రాంగం దగ్గర వాపోయినా వారు పట్టించుకోలేదు. అందుకే ఆత్యహత్యే శరణ్యమని భావించా' అంటూ పేర్కొన్నాడు.


Tags :
|

Advertisement