Advertisement

  • విజయవాడ లో ఘోరం ..కారులో మనుషులను ఉంచి నిప్పంటించిన వ్యక్తి

విజయవాడ లో ఘోరం ..కారులో మనుషులను ఉంచి నిప్పంటించిన వ్యక్తి

By: Sankar Mon, 17 Aug 2020 8:02 PM

విజయవాడ లో ఘోరం ..కారులో మనుషులను ఉంచి నిప్పంటించిన వ్యక్తి


స్వర్ణ పాలస్ లో ఫైర్ ఆక్సిడెంట్ ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన విజయవాడలో అందరు చూస్తుండగానే మరొక ఫైర్ ఘటన జరిగింది ..అయితే ఈ సారి జరిగింది అనుకోకుండా కాదు ..కావాలనే కార్ లో మనుషులను ఉంది డోర్ లాక్ చేసి నిప్పటించారు..ల్యాండ్ సెటిల్‌మెంట్ వ్యవహారంలో ఆగ్రహం చెందిన వ్యక్తి.. ముగ్గురిని కారులోనే ఉంచి పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు తెలుస్తోంది. నిందితుడిని వేణుగోపాల్‌రెడ్డిగా గుర్తించారు.

నిందితుడు వేణుగోపాల్ రెడ్డి మరో ముగ్గురు కృష్ణా రెడ్డి, గంగాధర్, నాగమల్లితో ల్యాండ్ విషయమై కారులో కూర్చుని చర్చిస్తున్నట్లు సమాచారం. చర్చల మధ్యలో ఒక్కసారిగా కిందకు దిగిన వేణుగోపాల్ రెడ్డి ముగ్గురినీ లోపలే ఉంచి కారుపై పెట్రోల్ పోసి నిప్పంటించి హత్యాయత్నం చేశాడు.

ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కారు పూర్తిగా దగ్థమైంది. ఈ ఘటనలో కృష్ణా రెడ్డి, గంగాధర్, నాగమల్లి మంటల్లో కాలిపోయి తీవ్రగాయాలపాలయ్యారు. వారిలో నాగమల్లి, కృష్ణా రెడ్డి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. విజయవాడ డీసీపీ హర్ష వర్ధన్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

Tags :
|
|
|
|

Advertisement