Advertisement

  • ఇరవై మంది ప్రయాణికులు ఉన్న బస్సును హైజాక్ చేసిన దుండగుడు

ఇరవై మంది ప్రయాణికులు ఉన్న బస్సును హైజాక్ చేసిన దుండగుడు

By: Sankar Tue, 21 July 2020 4:28 PM

ఇరవై మంది ప్రయాణికులు ఉన్న బస్సును హైజాక్ చేసిన దుండగుడు



ఉక్రెయిన్‌లో ఓ దుండ‌గుడు బ‌స్సును హైజాక్ చేశాడు. ఉక్రెయిన్ ఈశాన్య ప్రాంతంలోని ల‌స్క్ న‌గ‌రంలో 20 మంది ప్ర‌యాణికుల‌తో వెళ్తున్న బ‌స్సును దుండ‌గుడు హైజాక్ చేసి ఓ థియేట‌ర్ స‌మీపంలో పార్క్ చేయించాడ‌ని, బ‌స్సులోని ప్ర‌యాణికులంద‌రినీ బందీలుగా చేసుకున్నాడ‌ని స్థానిక పోలీసులు వెల్ల‌డించారు. దుండగుడి ద‌గ్గ‌ర భారీగా పేలుడు ప‌దార్థాలు, ఆయుధాలు ఉన్నాయ‌ని చెప్పారు.

కాగా, దుండగుడి చెర‌నుంచి ప్ర‌యాణికుల‌ను ర‌క్షించ‌డానికి పోలీసులు స్పెష‌ల్ ఆప‌రేష‌న్ చేప‌ట్టారు. ఘ‌ట‌నా ప్రాంతాన్ని చుట్టుముట్టి స్థానికులను అక్క‌డి నుంచి ఖాళీ చేయించారు. ఒక‌వైపు ఆప‌రేష‌న్ కొన‌సాగిస్తూనే, మ‌రోవైపు దుండ‌గుడితో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు.

అయితే దుండగుడి డిమాండ్స్ ఏమిటో తెలియ‌డంలేద‌‌ని ఉక్రెయిన్‌ నేష‌న‌ల్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఓ అధికారి చెప్పారు. వ్య‌వ‌స్థపై అసంతృప్తి ఉందని దుండ‌గుడు చెబుతున్నాడ‌ని, అయితే ఏ వ్య‌వ‌స్థ అనేది మాత్రం అత‌ను క‌చ్చితంగా చెప్ప‌లేద‌ని ఆయ‌న తెలిపారు. ‌

Tags :
|
|
|

Advertisement