Advertisement

  • మతం మార్చుకోవడంలేదు అని భార్యను అతి కిరాతకంగా హత్య చేసిన భర్త

మతం మార్చుకోవడంలేదు అని భార్యను అతి కిరాతకంగా హత్య చేసిన భర్త

By: Sankar Sat, 26 Sept 2020 06:55 AM

మతం మార్చుకోవడంలేదు అని భార్యను అతి కిరాతకంగా హత్య చేసిన భర్త


దేశంలో హత్యలు, అత్యాచారాలు దేశంలో భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. అత్యాచారాలను అరికట్టేందుకు ప్రభుత్వాలు కఠిన చట్టాలు, చర్యలు తీసుకుంటున్నా ఏ మాత్రం తగ్గడం లేదు. పైగా రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.

ఇక ఇదిలా ఉంటె, ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కట్టుకున్న భర్త అతి కిరాతకంగా హత్య చేశాడు. పెళ్లి చేసుకున్న నెల రోజులకే భార్యను హత్య చేశాడు. ఉత్తర ప్రదేశ్ లో ఈ సంఘటన జరిగింది. ఉత్తర ప్రదేశ్ లోని ప్రీత్ నగర్ కు చెందిన ప్రియా సోని అనే యువతి, ఇజాజ్ అహ్మద్ అనే వ్యక్తిని ప్రేమించి పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకుంది. పెళ్లి తరువాత భర్త ఇజాజ్ ఆమెను మతం మార్చుకోవాలని ఒత్తిడి తీసుకురావడం మొదలుపెట్టాడు. భర్త ఎంతగా ఒత్తిడి చేసినా ఆమె మతం మార్చుకోవడానికి అంగీకరించలేదు.

దీంతో ఆగ్రహించిన భర్త ఆమెను ప్రీత్ నగర్ ఏరియాలోని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి తన స్నేహితుడి సహాయంతో దారుణంగా హత్య చేశాడు. హత్య చేయబడిన యువతి తండ్రి ఆమెను గుర్తు పట్టడంతో పోలీసులు కేసును నమోదు చేసుకున్నారు. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా బగ్గా నాలా పూల్ వద్ద అరెస్ట్ చేసి జాతీయ భద్రతా చట్టం కింద కేసులు నమోదు చేశారు

Tags :
|
|

Advertisement