Advertisement

  • నిజామాబాదు లో ఇద్దరు చిన్నారులపై అత్యాచారం ..చితకబాదిన గ్రామస్థులు

నిజామాబాదు లో ఇద్దరు చిన్నారులపై అత్యాచారం ..చితకబాదిన గ్రామస్థులు

By: Sankar Mon, 06 July 2020 3:15 PM

నిజామాబాదు లో ఇద్దరు చిన్నారులపై అత్యాచారం ..చితకబాదిన గ్రామస్థులు



ఇటీవలకాలం లో అభంశుభం తెలియని చిన్నారుల మధ్య హత్యచారాలు ఎక్కువగా జరుగుతున్నాయి ..చిన్న వయసు ఉన్న పిల్లలకు తిను బండారాలు ఆశ చూపి , కామాంధులు ఆ పిల్లలను లైన్గికంగా వేధిస్తున్నారు ..తాజాగా అలంటి ఘటనే తెలంగాణ లోని నిజామాబాదు జిల్లాలో చోటు చేసుకుంది ..ఎడపల్లి మండలంలోని జంలం గ్రామానికి చెందిన నారాయణ (50) అనే వ్యక్తి గత పదిహేనేళ్లుగా జానకంపేటలోని అత్తగారింట్లో ఉంటున్నాడు ..

ఇంటి పక్కనే ఉండే ఇద్దరు చిన్నారులపై కన్నేసిన అతడు.. ఇటీవల వారికి చాక్లెట్‌ ఆశ చూపి సమీపంలోని పాడుబడ్డ ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. బాధితుల్లో ఒకరు ఎనిమిదేళ్ల చిన్నారి కాగా, మరొకరు ఏడేళ...పాప. మూత్ర విసర్జన సమయంలో తరచూ నొప్పి వస్తుండడంతో చిన్నారులు ఆ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పారు....

అసలేం జరిగిందని పెద్దలు ఆరా తీయగా, విషయం బయట పడింది. దీంతో ఆగ్రహోదగ్రులైన స్థానికులు ఆదివారం నారాయణను చితకబాది పోలీసులకు అప్పగించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రశ్నించగా నేరాన్ని అంగీకరించారు .ఘటనా స్థలాన్ని రూరల్‌ సీఐ రవీందర్‌నాయక్, ఎస్సై ఎల్లాగౌడ్‌ పరిశీలించారు. బాధిత చిన్నారులను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు ..తల్లి తండ్రుల ఫిర్యాదు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు

Tags :
|
|

Advertisement